Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చివరి శ్వాస వరకు.. మమల్ని ఏ చట్టం విడదీయలేదు.. వనిత వివాదాస్పద ట్వీట్
తమిళ నటి వనితా విజయ్ కుమార్, సినీ ప్రముఖుడు పీటర్ పాల్ పెళ్లిపై వివాదం, చర్చ ఇంకా మీడియాలో కొనసాగుతూనే ఉంది. ఆమెపై కొందరు టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తుంటే.. వారికి తనదైన శైలిలో ధీటుగా జవాబిస్తూ వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నది. తాజాగా ఆమె తన పెళ్లి, ప్రేమ గురించి చేసిన ట్వీట్ మీడియాలో వైరల్గా, వివాదంగా మారింది. ఇంతకు వనితా విజయ్ కుమార్ చేసిన ట్వీట్ ఏమిటంటే..
తమిళ మీడియాలో ప్రకంపనలు
వనితా విజయ్ కుమార్, పీటర్ పెళ్లి వార్త తమిళ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. వీరి పెళ్లి నేపథ్యంలో తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలంటూ పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఇటీవల మీడియాలో కూడా వెల్లడించింది.
తమిళ ప్రముఖుల కామెంట్లు
ఇంకా తమిళ చిత్ర పరిశ్రమలో వనితా విజయ్ కుమార్ పెళ్లిపై పలువురు ప్రముఖులు కామెంట్లు చేస్తూ వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు. అయినా ఆమె మౌనంగా ఉంటూ సమాధానాలు గట్టిగానే చెబుతున్నారు. తన పిల్లలు, తన పెళ్లిని టార్గెట్ చేస్తున్న వారికి సోషల్ మీడియాలో ధీటుగా జవాబిస్తున్నారు.
అమ్మ అంటే సర్వస్వం అంటూ
తన భర్త పీటర్ పాల్ వ్యక్తిగత వ్యవహారం, వ్యసనాలను ముడిపెడుతూ తన పిల్లల భవిష్యత్ గురించి కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో వాటికి ధీటుగా జవాబిచ్చేలా ఓ పోస్టును పెట్టారు. పీటర్ పాల్తో తన కూతురు ఉన్న ఫోటోను షేర్ చేశారు. రియల్ డాడీ లేని వారికి అంటూ కామెంట్ పెట్టారు. రియల్ ఫాదర్ వేరు.. డాడీ వేరు. డాడీ అంటే అమ్మ.. అమ్మ అంటే సర్వస్వం అంటూ ట్వీట్ చేశారు.
నా పెళ్లి రింగ్స్ ఇవే అంటూ
ఇలా నర్మగర్భమైన ట్వీట్ చేసిన వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఉంగరాల ఫోటోను పెట్టి.. లాక్డౌన్ తర్వాత ఎట్టకేలకు నా రింగ్స్ వచ్చేశాయి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొనే సమయంలో ధరించడానికి రెండు ఉంగరాలను రిజర్వు చేయించి పెట్టాను. నా సోల్మేట్ గురించి అర్ధం కాని వాళ్లకు ఎప్పటికీ తెలుసుకోలేరు అంటూ కామెంట్ చేశారు.
Recommended Video
ఏ చట్టం విడదీయలేదు..
నాకు
భగవంతుడు
నాకు
బెస్ట్
బడ్టీస్
పంపారు.
మేము
ఎప్పటికీ
ప్రేమలోనే
ఉంటాం.
చివరి
శ్వాస
వరకు
నా
బంధం
కొనసాగుతుంది.
ఏ
చట్టం,
ఏ
డ్రామా
కంపెనీలు
కూడా
నా
బంధాన్ని
విడదీయలేవు
అంటూ
వనితా
విజయ్
కుమార్
ట్వీట్లో
పేర్కొన్నారు.
ఈ
పోస్టు
ప్రస్తుతం
మీడియాలో
వైరల్గా
మారింది.