Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కిందకు లాగే ప్రయత్నం చేయొద్దు.. విద్యాబాలన్ స్ట్రాంగ్ కౌంటర్
బబ్లీ లుక్లో కనిపించే బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్కి దేశమంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బొద్దుగా ఉంటే హీరోయిన్ హీరోయిన్ గా రాణించలేరు అనే మూస ధోరణికి ఖచ్చితమైన సమాధానమే విద్యాబాలన్. బొద్దుగా ఉన్నా ఫుల్లుగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా టూ మచ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది విద్య. వెండితెర మీద ఎలాంటి క్యారెక్టర్ చేయడంలో నైనా దిట్ట అయినటువంటి ఈ సుందరి డర్టీ పిక్చర్ సినిమా ద్వారా దేశ వ్యాప్త పాపులారిటీ తెచ్చుకుంది. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది విద్యాబాలన్.
ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ విద్యాబాలన్ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయట. ఆమె బబ్లీ లుక్, ఓవర్ వెయిట్ లాంటి కారణాల వల్ల సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. లావు ఎక్కువగా ఉన్న నీవు ఎలా హీరోయిన్ అవుతావంటూ లెక్కలేనంత మంది ఆమెను విమర్శించారట. అయినా అవేవీ పట్టించుకోకుండా కేవలం ప్రతిభనే నమ్ముకొని.. ఎలాగైనా సక్సెస్ సాధిస్తాననే ఉద్దేశ్యంతో తాను సినీ రంగంలోకి అడుగు పెట్టానని అంటోంది విద్యాబాలన్.
ఎప్పుడు కూడా ఇతరుల శరీర బరువు అలాగే శరీర సౌందర్యం లాంటి వాటిపై జోకులు చేయకూడదని, అది వారిని ఎంతగా ఇబ్బంది పెడుతుంతో గుర్తించాలని విద్యాబాలన్ పేర్కొంది. ''అవతలి వారి ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా మాట్లాడటం అస్సలు సబబు కాదు. మనం చేయలేనిది ఇతరులు చేస్తున్నారంటే వారిని ఇబ్బందికర మాటలతో కిందికి లాగే ప్రయత్నాలు చేయడం చెడ్డ వారి ఉత్తమ లక్షణం'' అంటూ ఎవరైతే తనను విమర్శించారో, నేటికీ విమర్శిస్తున్నారో అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ వేసింది విద్య.
ఇక విద్యాబాలన్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్లో కాస్త అవకాశాలు తగ్గడం వల్ల సౌత్ సినిమాల వైపు ఈమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల నందమూరి బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలాగే తమిళ ఆడియన్స్ ని కూడా పలకరించేందుకు గాను తాజాగా అజిత్ జోడీగా పింక్ రీమేక్ అయిన 'నేర్కొండ పార్వై' చిత్రంతో రాబోతోంది.