Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేషనల్ లెవెల్ కమర్షియల్ యాడ్ కి ఐదు కోట్లు తీసుకున్నస్టార్ హీరో...!?
మన తెలుగు హీరోల్లా తమిళ హీరో విజయ్ కూడా తాజాగా సైడ్ బిజినెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అంటే... కమర్షియల్స్ యాడ్స్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఓ జాతీయ టెలికం కంపెనీకి బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరించడానికి విజయ్ సైన్ చేశాడు. అందుకోసం అత్యధిక మొత్తంలో అంటే, ఐదు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నాడట. ఈ అడ్వర్ టైజ్మెంట్ షూటింగు మూడు రోజుల పాటు జరుగుతుంది. మామూలుగా తమిళ హీరోలు మన హీరోల్లా కమర్షియల్స్ అంత ఎక్కువగా చేయరు. ఒక్క టెలికాం కంపెనీలకే చేస్తుంటారు. సూర్య, కార్తీ కూడా అలాగే రెండు టెలికాం కంపెనీలకు బ్రాండ్ అంబాసడార్ గా చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ కూడా వీరి బాటలో పయనిస్తున్నాడన్న మాట.
కాగా ఇటీవల వచ్చిన పలు తమిళ అనువాద చిత్రాలు తెలుగులో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో....మరికొందరు తెలుగు సినిమా మార్కెట్ పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సూర్య, విక్రమ్, విశాల్ లాంటి హీరోలు తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించగా, ఆర్య, జీవ లాంటి హీరోలు ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై తమ సక్సెస్ రేటును పెంచుకుంటున్నారు.
తాజాగా తమిళ హీరో విజయ్ కూడా తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. తన తాజా సినిమా 'ఆది" సినిమాను తమిళంతో పాటు, తెలుగులో 'నేనేరా ఆది" పేరుతో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ చిత్రం 'త్రీ ఇడియట్స్" తమిళ రీమేక్ 'నన్బన్" చిత్రంగా షూటింగ్ పూర్తి కావస్తోంది.