Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాహుబలి ఫార్ములా ఫాలో అవుతున్న స్టార్ హీరో!
బాహుబలి చిత్రం తెలుగు సినిమా మార్కెట్ నే పూర్తిగా మార్చేసింది. ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి తరువాత అంతర్జాతీయంగా కూడా భారత సినిమాలు రాణిస్తున్నాయి. బాహుబలి 2, దంగల్ లాంటి చిత్రాలు చైనా, జపాన్ గడ్డపై కూడా రాణించాయి. అదే స్పూర్తితో మరో బ్లాక్ బస్టర్ చిత్రం కూడా చైనా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది.
మెర్సల్
గత ఏడాది విజయ్ నటించిన మెర్సల్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. భారత వైద్య రంగంపై దర్శకుడు అట్లీ ఈ చిత్రంతో బాణం సాధించాడు.
ఉచిత వైద్యం
అందరికి ఉచిత వైద్యం పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. విజయ్ త్రిపాత్రాభినయంలో విశ్వరూపం ప్రదర్శించాడు. విజయ్ నటన, అట్లీ కథని నడిపించిన విధంగా ఆడియన్స్ కు విపరీతంగా నచ్చాయి.
200 కోట్లు
కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తూ ఈ చిత్రం 200 కోట్లకు రాబట్టింది. వివాదాలు మొదలైనా తట్టుకుని నిలబడి బాక్స్ ఆఫీస్ ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలో కాజల్, సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటించారు.
చైనా
ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటె చైనా ఆడియన్స్ భారతీయ చిత్రాలని కూడా ఆదరిస్తారని దంగల్, బాహుబలి 2 చిత్రాలతో నిరూపితమైంది. 2019 ఆరంభంలో ఈ చిత్రం చైనాలో విడుదల కానుంది.