Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాహుబలి ఫార్ములా ఫాలో అవుతున్న స్టార్ హీరో!
బాహుబలి చిత్రం తెలుగు సినిమా మార్కెట్ నే పూర్తిగా మార్చేసింది. ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి తరువాత అంతర్జాతీయంగా కూడా భారత సినిమాలు రాణిస్తున్నాయి. బాహుబలి 2, దంగల్ లాంటి చిత్రాలు చైనా, జపాన్ గడ్డపై కూడా రాణించాయి. అదే స్పూర్తితో మరో బ్లాక్ బస్టర్ చిత్రం కూడా చైనా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది.
మెర్సల్
గత ఏడాది విజయ్ నటించిన మెర్సల్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. భారత వైద్య రంగంపై దర్శకుడు అట్లీ ఈ చిత్రంతో బాణం సాధించాడు.
ఉచిత వైద్యం
అందరికి ఉచిత వైద్యం పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. విజయ్ త్రిపాత్రాభినయంలో విశ్వరూపం ప్రదర్శించాడు. విజయ్ నటన, అట్లీ కథని నడిపించిన విధంగా ఆడియన్స్ కు విపరీతంగా నచ్చాయి.
200 కోట్లు
కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తూ ఈ చిత్రం 200 కోట్లకు రాబట్టింది. వివాదాలు మొదలైనా తట్టుకుని నిలబడి బాక్స్ ఆఫీస్ ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలో కాజల్, సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటించారు.
చైనా
ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటె చైనా ఆడియన్స్ భారతీయ చిత్రాలని కూడా ఆదరిస్తారని దంగల్, బాహుబలి 2 చిత్రాలతో నిరూపితమైంది. 2019 ఆరంభంలో ఈ చిత్రం చైనాలో విడుదల కానుంది.