Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలి ఫార్ములా ఫాలో అవుతున్న స్టార్ హీరో!
బాహుబలి చిత్రం తెలుగు సినిమా మార్కెట్ నే పూర్తిగా మార్చేసింది. ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి తరువాత అంతర్జాతీయంగా కూడా భారత సినిమాలు రాణిస్తున్నాయి. బాహుబలి 2, దంగల్ లాంటి చిత్రాలు చైనా, జపాన్ గడ్డపై కూడా రాణించాయి. అదే స్పూర్తితో మరో బ్లాక్ బస్టర్ చిత్రం కూడా చైనా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది.
మెర్సల్
గత ఏడాది విజయ్ నటించిన మెర్సల్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. భారత వైద్య రంగంపై దర్శకుడు అట్లీ ఈ చిత్రంతో బాణం సాధించాడు.
ఉచిత వైద్యం
అందరికి ఉచిత వైద్యం పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. విజయ్ త్రిపాత్రాభినయంలో విశ్వరూపం ప్రదర్శించాడు. విజయ్ నటన, అట్లీ కథని నడిపించిన విధంగా ఆడియన్స్ కు విపరీతంగా నచ్చాయి.
200 కోట్లు
కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తూ ఈ చిత్రం 200 కోట్లకు రాబట్టింది. వివాదాలు మొదలైనా తట్టుకుని నిలబడి బాక్స్ ఆఫీస్ ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంలో కాజల్, సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటించారు.
చైనా
ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటె చైనా ఆడియన్స్ భారతీయ చిత్రాలని కూడా ఆదరిస్తారని దంగల్, బాహుబలి 2 చిత్రాలతో నిరూపితమైంది. 2019 ఆరంభంలో ఈ చిత్రం చైనాలో విడుదల కానుంది.