Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
యూనిట్ సభ్యులకు హీరో బంగారు గొలుసుల నజరానా
వేలాయుధం చిత్ర సాంకేతిక వర్గానికి ఆ చిత్ర హీరో విజయ్ బంగారు గొలుసులను అందించారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి జయం రాజ దర్శకుడు. విజయ్, జెనీలియా, హన్సిక నటిస్తున్నారు. చెల్లెలి పాత్రలో శరణ్యమోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు పూర్తి అయింది. దీపావళికి విడుదల కానుంది.
ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలను ఇటీవల విజయ్ చూశారట. చాలా గొప్పగా వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారట. పక్కనున్న దర్శకుడు జయం రాజాను, కెమెరామన్ ప్రియన్ను కౌగిలించుకున్నారట. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గానికి కాసు బంగారు గొలుసులను బహుమతిగా అందించారు. వేలాయుధం చిత్రానికి హీరో విజయ్ హైలెట్ అని దర్శకుడు జయం రాజా అంటున్నారు.విజయ్ చిత్రాల్లో బెస్ట్ క్లైమాక్స్ గా ఇది నిలిచిపోతుందని జయం రాజా అంటున్నారు.
ఈ చిత్రంలో మరొకొన్ని హైలెట్స్ ఏంటంటే కోటిన్నర రూపాయల ఖర్చుతో వివాహ వేదిక సెట్, గ్రామమంతా తోరణాలు కట్టి, సీరియల్ లైటింగ్తో అలంకరించి చిత్రీకరించిన సన్నివేశాలు ఒక హైలెట్. చిత్రం కోసం ఆ ఊరిలో ఒక పెద్ద బావిని తవ్వి చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత వారికి బహుమతిగా ఇచ్చాం. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మరో హైలెట్. తిరుమూర్తి మలై ప్రాంతంలో చిత్రీకరించిన ఈ పాటకు అశోక్రాజ్ నృత్య దర్శకత్వం వహించా రు. 200 మందికి పైగా గ్రామీణ కళాకారులు, 150 మంది విదేశీ డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఈ పాట చిత్రీకరణకు రెండు కోట్లకు పైగా నిర్మాత రవిచంద్రన్ ఖర్చు చేశారని సమాచారం.