కుర్ర హీరోతో నయనతార రొమాన్స్
చెన్నై : కాలానికి తగ్గట్టు తమను తాము మలచుకోకపోతే.. రాణించడం సాధ్యం కాదని నయనతార కి తెలిసినట్లు మరొకరకి తెలియదేమో. అందుకే అగ్రహీరోలతో ఆడిపాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. కుర్ర హీరోలతోనూ జతకడుతోంది నయన్. బాలకృష్ణ-ఎన్టీఆర్, వెంకటేష్- రాణా.. వంటి బాబాయ్- అబ్బాయిలతో జోడీ కట్టిందీ ముద్దుగుమ్మ. రజనీకాంత్, ధనుష్ల సరసన కూడా ఆడిపాడింది. నయన్కి పోటీగా ఎందరొచ్చినా.. ఇప్పటికీ ఆమె క్రేజీ మాత్రం కోలీవుడ్లో తగ్గలేదనే చెప్పాలి.
ఇటీవల నటుడు జై సరసన ఆడిపాడి అందర్నీ ఆకట్టుకుంది. త్వరలో విజయాల వీరుడు విజయసేతుపతితో కూడా కలిసి నటించనుంది. ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నానుం రౌడీ దాన్' (నేనూ రౌడీనే) అని టైటిల్ పెట్టారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో 'సూదుకవ్వుం' స్టెల్లో ఇక్కడ ఎవర్ని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. అందుకు 'నయనతార' అని సమాధానమిచ్చారు విజయ్ సేతుపతి.

'నయన్ అంటే ఎంత ఇష్టమని' ప్రశ్నించగా.. తెగ సిగ్గుపడిపోయి సమాధానం కూడా చెప్పకుండా దాటవేశారు విజయ్. ఈ కార్యక్రమానికి అదో పెద్ద హైలెట్గా మారింది. ఇప్పుడు ఏకంగా విజయ్ సేతుపతి కల నెరవేరింది. ఈ విషయాన్ని ధనుష్ తన ట్విట్టర్లో ప్రస్తావించగా.. అందుకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. వారిలో ఓ వ్యక్తి.. 'కొక్కి కుమార్' నిర్మించగా 'సుమారు మూంజి కుమారు' నటిస్తున్నారని చేసిన పోస్టును.. ధనుష్ రీట్వీట్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











