మలయాళీ హిట్ 'ఉస్తాద్ హోటల్' రీమేక్లో ...

'తలప్పాకట్టి' పేరుతో తెరకెక్కనున్న ఇందులో సీనియర్ నటుడు రాజ్కిరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం 'అరిమానంబి' చిత్రీకరణలో బిజీగా ఉన్న విక్రమ్ప్రభు అనంతరం నటించనున్న చిత్ర ఇదేనని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడిస్తున్నాయి. పేరుకు మలయాళ రీమేక్ అయినా.. తమిళ వాతావరణానికి తగిన మార్పులు కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఇక ప్రభు కుమారుడు విక్రంప్రభు హీరోగా నటించిన రెండోచిత్రం 'ఇవన్ వేరమాదిరి'. 'ఎంగేయుం ఎప్పోదుం' ఫేం శరవణన్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విక్రంప్రభుకు పేరు తెచ్చిపెట్టింది. తిరుపతి బ్రదర్స్ బ్యానరుపై లింగుస్వామి నిర్మించిన ఈ సినిమాను సూపర్స్టార్ రజనీకాంత్ తాజాగా చూశి మెచ్చుకున్నారు. దాంతో హీరో విక్రం ప్రభు మురిసిపోతున్నాడు.
సినిమా చూసిన అనంతరం చిత్రయూనిట్ను మెచ్చుకున్నారు. అనంతరం విక్రంప్రభుకు ప్రశంసాపత్రాన్ని కూడా పంపించారట. 'ఇది క్లాస్, మాస్ కలగలసిన చిత్రం. ఏ సినిమాలోనూ లేని కీలక సన్నివేశాలు ఇందులో చూసి ఆశ్చర్యపోయా. మంచి కాలక్షేప చిత్రం కూడా. విజయవంతమైన ఈ సినిమాకు నా అభినందనలు తెలియజేస్తున్నాను''అని అందులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











