Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'శివతాండవం'లో విక్రమ్ పాత్ర స్పెషాలిటీ ఏంటి?
చెన్నై : విక్రమ్ సినిమాలంటే వైవిధ్యాలకు పెట్టింది పేరు. తాజాగా విక్రమ్, అనుష్క కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'శివతాండవం'. ఇందులో విక్రమ్ అంధుడిగా కనిపిస్తారు. చూపు లేకపోయినా శబ్దం ద్వారా లక్ష్యాన్ని చేధించే వ్యక్తిగా అతని పాత్ర ఉంటుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి దర్శకుడు ఎ.ఎల్ విజయ్ మాట్లాడుతూ..'అసాధారణ శక్తులున్న ఓ అంధుడి జీవిత కథే 'శివతాండవం. కాలగమనంలో కఠిన పరీక్షల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్ర ఇతివృత్తం. అతనిలో వున్న ఓ అసాధారణ శక్తి ఏమిటనేది సినిమాలో ఆసక్తికరమైన పాయింట్' అన్నారు.
విక్రమ్, జగపతి బాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్ దర్శ కత్వంలో సి.కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం. ఇక ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనుష్క. ఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర హైలెట్ కానుంది.
నిర్మాత మాట్లాడుతూ.. 'ప్రాణ వ్రపదంగా పెరిగిన ఇద్దరు మిత్రుల కథ ఇది. అధిక భాగం లండన్లో చిత్రీకరించాం. విక్రమ్ పాత్ర చిత్రణ సరికొత్త తరహాలో వుంటుంది. జగపతిబాబు కీలక పాత్రలో అలరిస్తారు' అన్నారు. అలాగే ..''ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. జీవీ ప్రకాష్కుమార్ వినసొంపైన స్వరాలు అందించారు''అన్నారు. అమీ జాక్సన్, లక్ష్మీరాయ్ ఇతర హీరోయిన్స్.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, సంతానమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. విక్రమ్కి సౌత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క, యామీ జాక్సన్, లక్ష్మీరాయ్, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్, ఢిల్లి గణేష్ ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాల్ని లండన్లో చిత్రించారు. జగపతిబాబు కీలక పాత్రధారి. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత.