Don't Miss!
- Finance Bitcoin Crash: భారీగా పతనమైన బిట్కాయిన్.. ఇండియాకి బినాన్స్ తిరిగి ఎంట్రీ..
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వాడు వచ్చే వరకు తాళి కట్టను అన్నారు.. భర్త గురించి సౌందర్య రజనీకాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో వివాహం ఇటీవల చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. బంధు మిత్రుల మధ్య వివాహంతో సౌందర్య రజనీకాంత్, విశాగన్ ఒక్కటయ్యారు. విశాగన్ ఫార్మా కంపెనీ అధినేతగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఇక సౌందర్య రజని కుమార్తెగా సినిమాల్లో రంగంలో గ్రాఫిక్ డిజైనర్ గా మంచి ప్రావీణ్యమే సంపాదించింది. సౌందర్య, విశాగన్ ఇద్దరికీ ఇది రెండవ వివాహం. తాజాగా సౌందర్య ఓ ఇంటర్వ్యూలో సౌందర్య రజినీకాంత మాట్లాడుతూ విశాగన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తొలి భర్త నుంచి విడిపోయి
సౌందర్య రజనీకాంత్ తన మాజీ భర్త అశ్విన్ నుంచి 2017లో విడిపోయింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. విశాగన్ నటుడిగా తమిళ చిత్రాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఫార్మా కంపెనీకి విశాగన్ అధినేత. తమిళ సినీ రాజకీయ ప్రముఖులందరిని రజనీకాంత్ తన కుమార్తె రెండవ వివాహానికి ఆహ్వానించారు.
వేద్కు బాగా నచ్చారు
సౌందర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కొడుకు వేద్ కు విశాగన్ ఫోటో చూపించి ఇదిగో డాడీ అని చెప్పాను. వేద్ కు విశాగన్ చాలా బాగా నచ్చారు. విశాగన్ కూడా వేద్ పట్ల ఎంతో ప్రేమ ప్రదర్శిస్తారు. పెళ్లి సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనని సౌందర్య ఇంటర్వ్యూలో పంచుకుంది. పెళ్లి సమయానికి వేద్ ని మా వాళ్ళు మండపానికి తీసుకురావడంలో ఆలస్యం చేశారు. వేద్ వస్తాడో రాడో అని తాను చాలా కంగారుపడ్డాను అని సౌందర్య తెలిపింది.
వాడు వచ్చేవరకు తాళి కట్టను
నేను కంగారు పడడం విశాగన్ గమనించారు. టెన్షన్ పడకు.. వేద్ వచ్చే వరకు తాళి కట్టాను అని అన్నారు. వేద్ ని విశాగన్ చాలా బాగా చూసుకుంటారు. నాకు కావాల్సింది కూడా అదే. నా పిల్లల వద్ద ఎలాంటి విషయాలు దాచిపెట్టను. నేను మీ అమ్మని పెళ్లి చేసుకుంటున్నాను.. నీకు ఇష్టమేనా అని విశాగన్ వేద్ అనుమతి తీసుకున్నాడు కూడా. ఆ వీడియో కూడా ఉంది. దానిని ఇప్పుడే బయట పెట్టను. వేద్ కు 18 ఏళ్ళు వచ్చాక బయటపెడతా అని సౌందర్య తెలిపింది.
దర్శకురాలిగా
సౌందర్య రజనీకాంత్ కు గ్రాఫిక్ డిజైనింగ్ లో మంచి పట్టు ఉంది. అందువల్లనే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో కొచ్చాడియాన్ చిత్రాన్ని తెరకెక్కించింది. రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి సౌందర్యనే దర్శకురాలు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పలు చిత్రాలకు సౌందర్య గ్రాఫిక్స్ డిజైనింగ్ అందించారు.