Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫుల్ స్పీడ్ మీదున్న విశాల్.. ఆర్యతో కలిసి మరోసారి మల్టీస్టారర్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్కు తమిళ్లోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు నేపథ్యం ఉండటంతో ఇక్కడ కూడా భారీ క్రేజ్నే సొంతం చేసుకున్నాడు. డబ్బింగ్ సినిమాలే అయినప్పటికి స్ట్రెయిట్ సినిమా లెవెల్లో అదరగొడుతుంది. అభిమన్యుడు, డిటెక్టివ్ వంటి చిత్రాలతో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. త్వరలోనే డిటెక్టివ్ సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ మూవీ డైరెక్టర్ విషయంలో అప్పట్లో పెద్ద సెన్సేషనే జరిగింది.
డైరెక్టర్ మిస్కిన్ను తొలగించడం, మిగిలిన చిత్రాన్ని విశాల్ పూర్తి చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా డిటెక్టివ్ సీక్వెల్ రెడీ అవుతోంది. మరో వైపు చక్ర అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా మరో సినిమాను ప్రారంభించేశాడు. ఇందులో ఆర్య కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషించబోతోన్నాడు. ఇది వరకు వీరి కాంబినేషన్లో వాడు వీడు అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించబోతోన్నారు. ఈ మేరకు దర్శకుడు ఆనంద్ శంకర్ కొన్ని విషయాలను వెల్లడించాడు. ఆర్య విలన్గా నటించబోతోన్నాడు. ఓ హీరోయిన్గా మృనాళిని రవిని ఫిక్స్ చేశాం.. మరో ఫీమేల్ లేడీ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. ఇక ఇక్కడే కొన్ని రోజులు సినిమాను షూట్ చేయబోతోన్నామని యూనిట్ ప్రకటించింది.