శ్రియకి బాగా తీరింది!?

మరో ప్రక్క విక్రమ్ తో చేసిన మల్లన్న రికార్డులు తిరగరాస్తాడనుకుంటే అసలు ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని బయటపడతాడే తెలియని స్ధితిలో ఉంది. ఈ పరిస్ధితిల్లో త్వరపడకపోతే ఫలితం చాలా దారుణంగా ఉంటుందని ఊహించిన ఆమె విశాల్ కొత్త సినిమా Thoranai లో హీరోయిన్ గా ఒప్పుకుంది. ఇంతకు ముందు సెల్యూట్ సినిమాకు కూడా విశాలు పాపం అడిగాడు. అయితే అప్పటికి భ్రమలు ఇంకా తీరకపోవటంతో విశాల్ తో నాకు పనేంటనుకుని డేట్స్ ప్లాబ్లమ్ అని చెప్పింది.
ఇప్పుడు మూసుకుని ఈ చిత్రంకు కమిటవ్వటంతో కోలీవుడ్ వాసులు తిక్క కుదిరందని అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ మూడు నుండి ప్రారంభమవుతోంది. గతంలో విశాల్ తో భయ్యా చిత్రాన్ని రూపొందించిన భూపతి పాండ్యన్ శిష్యుడు అయ్యప్పన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడప. జి.కె ఫిల్మ్స్ కార్పోరేషన్ పై విక్రమ్ కృష్ణ నిర్మించనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇదే ఊపులో ఎవరైనా మన తెలుగు దర్శకులు శ్రియని అడిగితే కాదనదని కొందరు ధైర్యం చేయబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











