Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశాల్.. 10ఏళ్ళ తరువాత..
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా విశాల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో అదే తరహాలో తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక్కడ మీడియామ్ రేంజ్ హీరోల మాదిరిగా ఒక మార్కెట్ సెట్ చేసుకున్న ఈ హీరో అప్పుడప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలని కూడా అడుగులు వేస్తున్నాడు. ఆ మధ్య పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం కూడా ప్రయత్నం చేసినట్లు టాక్ వచ్చింది.
కానీ విశాల్ సౌత్ లో తప్పితే నార్త్ లో ఇంకా కొంత కూడా క్రేజ్ అందుకోలేదు. అందుకే ముందుగా సౌత్ ఇండియన్ భాషలపై వీలైనంత వరకు పట్టు సాధించాలని చూస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ యాక్షన్ హీరో ఒక మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం బాలా దర్శకత్వంలో అవన్ ఇవన్ (వాడు వీడు) అనే సినిమా చేసిన విశాల్ ఆర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ ఒక బిగ్ బడ్జెట్ సినిమా కోసం ఆర్యతో కలిసి నటించనున్నాడట.
విజయ్ దేవరకొండతో నోటా అనే సినిమా చేసిన ఆనంద్ శంకర్ వీరి మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేయనున్నాడట. ద్విభాషా చిత్రంగా ఆ ప్రాజెక్టును రూపొందించాలని అనుకుంటున్నట్లు టాక్. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ఇక గత ఏడాది నాని, విశాల్ కాంబినేషన్ లో కూడా ఒక మినీ మల్టీస్టారర్ ఉంటుందని కథనాలు వెలువడ్డాయి. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ వారి కోసం ఒక కథను కూడా రెడీ చేసినట్లు తెలిసింది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది.