Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శత్రువులుగా మారిన స్టార్ హీరోలు.. విశాల్-ఆర్య మధ్య పోరు
ఇద్దరు హీరోలను, అది కూడా మంచి నటులను ఒకే సినిమాలో పెట్టాలంటే కంటెంట్ ఏ రేంజ్లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే విశాల్ ఆర్య వంటి హీరోలతో వాడు వీడు అనే సినిమాను తీశాడు దర్శకుడు బాలా. అది తెలుగులో అంతగా వర్కవుట్ కాకపోయినా కోలీవుడ్లో క్లిక్ అయింది. అలాంటి చిత్రం తరువాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించబోతోన్నారు.
అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఈ మూవీ షూటింగ్ను ఓ పదిహేను రోజుల పాటు ఇక్కడే రామోజీ ఫిలీం సిటీలో షూట్ చేశారు. మొదటి షెడ్యూల్ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్డేట్ను ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ను తాజాగా రివీల్ చేశారు. ఎనిమీ అంటూ ఇద్దరి ఫోటోలను ఆ టైటిల్ లోగోలో పెట్టేశారు. అందులో ఈ ఇద్దరు శత్రువుల్లా మారి పోట్లాడేందుకు రెడీగా ఉన్నట్టు వారి కంటి చూపు చెబుతోంది.
నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య.. ఇప్పుడు నా ఎనిమీ అయ్యాడు అంటూ విశాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది.. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇద్దరి మధ్య జరిగే పోరాటం చాలా బాగుండబోతోందని విశాల్ తెలిపాడు. ఈ సినిమాలో ఆర్య విలన్గా నటించబోతోన్నాడు. ఓ హీరోయిన్గా మృనాళిని రవిని ఫిక్స్ చేశాం.. మరో ఫీమేల్ లేడీ ఫిక్స్ చేయాల్సి ఉందని చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తెలిపాడు.