Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శత్రువులుగా మారిన స్టార్ హీరోలు.. విశాల్-ఆర్య మధ్య పోరు
ఇద్దరు హీరోలను, అది కూడా మంచి నటులను ఒకే సినిమాలో పెట్టాలంటే కంటెంట్ ఏ రేంజ్లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే విశాల్ ఆర్య వంటి హీరోలతో వాడు వీడు అనే సినిమాను తీశాడు దర్శకుడు బాలా. అది తెలుగులో అంతగా వర్కవుట్ కాకపోయినా కోలీవుడ్లో క్లిక్ అయింది. అలాంటి చిత్రం తరువాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించబోతోన్నారు.
అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఈ మూవీ షూటింగ్ను ఓ పదిహేను రోజుల పాటు ఇక్కడే రామోజీ ఫిలీం సిటీలో షూట్ చేశారు. మొదటి షెడ్యూల్ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్డేట్ను ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ను తాజాగా రివీల్ చేశారు. ఎనిమీ అంటూ ఇద్దరి ఫోటోలను ఆ టైటిల్ లోగోలో పెట్టేశారు. అందులో ఈ ఇద్దరు శత్రువుల్లా మారి పోట్లాడేందుకు రెడీగా ఉన్నట్టు వారి కంటి చూపు చెబుతోంది.
నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య.. ఇప్పుడు నా ఎనిమీ అయ్యాడు అంటూ విశాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది.. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇద్దరి మధ్య జరిగే పోరాటం చాలా బాగుండబోతోందని విశాల్ తెలిపాడు. ఈ సినిమాలో ఆర్య విలన్గా నటించబోతోన్నాడు. ఓ హీరోయిన్గా మృనాళిని రవిని ఫిక్స్ చేశాం.. మరో ఫీమేల్ లేడీ ఫిక్స్ చేయాల్సి ఉందని చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తెలిపాడు.