Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోపీచంద్ హిట్ చిత్రంని రీమేక్ చేస్తున్న విశాల్
పందెం కోడి విశాల్ కి వరస ఫ్లాపులు ఎక్కువై పోయాయి. దాంతో మార్కెట్ ని నిలబెట్టుకోవాలంటే రీమేక్ లే శరణ్యమనుకున్నట్లున్నాడు. తాజాగా అతను గోపీచంద్ తెలుగులో చేసి హిట్ కొట్టిన శౌర్యం చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, సమీరారెడ్డి జంటగా నటిస్తున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో పూనంకౌర్ సెకండ్ హీరోయిన్గా నటించనున్నారు. జీకే ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రేయారెడ్డి నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మార్చి తొమ్మిదవ తేదీనుండి మొదలవనుంది. ఒక ప్రముఖ శృంగార నటిని ఐటమ్ సాంగ్లో నటింప జేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో గోపీచంద్, అనుష్క నటించిన శౌర్యం ఈ చిత్రాన్ని కెమెరామెన్ శివ దర్శకత్వం వహించారు. ఆయన రీసెంట్ గా తమిళంలో విక్రమార్కుడు చిత్రాన్ని రీమేక్ చేసి సంక్రాంతికి విడుదలచేసారు. కార్తీ హీరోగా చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక గోపీచంద్ ప్రస్తుతం ...కృష్ణవంశి కాంబినేషన్ నల్లమలుపు బుజ్జి నిర్మాతగా మొగుడు అనే టైటిల్ తో రూపొందే చిత్రంలో చేస్తున్నాడు.