Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'కథాకళి': విశాల్ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్
చెన్నై: విశాల్, కేథరిన్ త్రేసా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళచిత్రం 'కథాకళి' చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ని నటుడు విశాల్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, పసంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దర్శకుడు పాండి రాజ్ మాట్లాడుతూ.., "మీ అందరి ఆశీస్సులతో...నా తదుపరి చిత్రం కథాకళి ప్లాన్ చేసాను. ఈ చిత్రం విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ మరియు పసంగ ప్రొడక్షన్స్ కలిపి నిర్మిస్తాయి. ఇది జాయింట్ వెంచర్" అన్నారు. పిడికిలి బిగించిన పోస్టర్తోపాటు విశాల్ కళ్ళు అగ్నిగోళాల్లా మండి పోతున్న మరో పోస్టర్ ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
రీసెంట్ గా సూర్య నిర్మాణంలో పసంగ-2, శింబు, నయనతార జంటగా 'ఇదు నమ్మ ఆలు' చిత్రాలను పూర్తిచేసిన దర్శకుడు పాండిరాజ్.. ఇప్పుడు విశాల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. గత నెల రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇక కథాకళి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో విశాల్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కొంబన్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ముత్తయ్య ఇప్పుడు విశాల్ను డెరైక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి మరుదు అనే పేరును ఖరారు చేశారు.
దర్శకుడు ముత్తయ్య ఇంతకు ముందు చేసిన కుట్టిపులి, కొంబన్ చిత్రాలలో హీరోయిన్గా నటించిన లక్ష్మిమీనన్నే ఈ మరుదు చిత్రంలో హీరోయిన్ గా నటింపజేయాలని భావించినట్లు సమాచారం.
అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నటి శ్రీదివ్యను ఆ అవకాశం వరించింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ పడి ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్న విశాల్, రాధారవి ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మరుదు చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది.