Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తండ్రికి సేవ చేస్తూ కరోనా.. విశాల్పై జీకే రెడ్డి ఎమోషనల్ ట్వీట్
ప్రస్తుతం కరోనా ఎంత తీవ్రంగా మారిందో అందరికీ తెలిసిందే. సామాన్య జనాల నుంచి ఏసీ భవనాల్లో ఉండే స్టార్స్ వరకు అందరికీ కరోనా వైరస్ వదిలి పెట్టడం లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి వారే కరోనా దెబ్బకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కరోనా ముందు అందరూ సమానమే. ప్రస్తుతం కరోనా వైరస్ కంటే.. కరోనా రోగులను, కరోనా సోకి చనిపోయిన వారి మృత దేహాల పరిస్థితి చూస్తుంటూనే మానవత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకితే వారి దూరంగానే ఉంచేస్తున్నారు. కానీ విశాల్ మాత్రం తన తండ్రికి కరోనా అని తెలియగా సేవలు చేసి పుత్రరుణం తీర్చుకున్నాడు.
కరోనా కలకలం..
విశాల్,
ఆయన
తండ్రి
జీకే
రెడ్డి,
వారి
మేనేజర్కు
కరోనా
వచ్చింది.
అయితే
ఈ
విషయాన్ని
చాలా
ఆలస్యంగా
బయట
పెట్టారు.
కరోనా
నుంచి
పూర్తిగా
కోలుకున్న
తరువాత
సోషల్
మీడియాలో
విశాల్
స్వయంగా
ప్రకటించాడు.
తామంతా
కరోనా
నుంచి
పూర్తిగా
కోలుకున్నామని
తెలిపాడు.
తండ్రి ద్వారా..
విశాల్కు కరోనా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో వాటిపై స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ‘ఇది నిజమే.. కోవిడ్-19 పరీక్షల్లో నాకు మా నాన్నకు పాజిటివ్ వచ్చింది. మా నాన్నకు సహాయకుడిగా ఉన్నందుకు నాకు కోవిడ్-19 సోకింది.. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో కొన్నిరోజులు ఇబ్బందిపడ్డా'నని చెప్పాడు.
ఆయుర్వేద పద్దతి..
విశాల్ తమతో ఉన్న మేనేజర్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డాట్లు చెప్పాడు. ఆయుర్వేద మెడిసిన వాడటం వల్ల కేవలం వారం రోజుల్లో డేంజర్ నుంచి బయటపడినట్లు పేర్కొన్నాడు. మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడి, ఆరోగ్యంగా ఉన్నామని, తెలిపాడు.
Recommended Video
తండ్రీ కొడుకుల బంధం...
జీకే రెడ్డికి మొదటగా కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయనకు సేవలు చేసే క్రమంలోనే విశాల్కు కూడా అంటింది. ఈ మేరకు జీకే రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు. ‘మానవత్వంతో ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొవచ్చని మరోసారి నిరూపితమైంది. ఎలాంటి గడ్డు పరిస్థితులైనా, ఎలాంటి వైరస్ అయినా.. మానవత్వం, ఫిట్నెస్ ఉంటే చాలు ఎదుర్కొవచ్చు. అందులో భాగంగా తండ్రీ కొడుకుల బంధం ముఖ్యమైంది. నా కొడుకు విశాల్.. మా కోసం నిలబడ్డాడు. కరోనాపై పోరాడేందుకు ముందడుగు వేశాడు'అని చెప్పుకొచ్చాడు. ఇక తండ్రికి సేవ చేయడంపై విశాల్ను రియల్ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లతో పొగిడేస్తున్నారు.