Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'విశ్వరూపం-2' కి అప్పుడే వార్నింగ్
'ముస్లిం మున్నె్ట్ర కళగమ్' అనే సంస్థ ముస్లిమ్లను టెర్రరిస్టులుగా చూపిస్తు న్నారంటూ..ఈసారి విశ్వరూపం 2ని అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన తన ప్రాజెక్టు ఏమైపోతుందోనని కమల్ ఆందోళన చెందుతున్నాడు. ముప్పేటలా సమస్యలు చుట్టుముట్టడంతో కమల్కి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తన డ్రీమ్ప్రాజెక్ట్ 'విశ్వరూపం'ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు కమల్. ఈ రెండు భాగాల్లో తనే హీరోగా నటిస్తూ, దర్శకత్వం, నిర్మాణబాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ టైమ్లో తమిళ ప్రభుత్వం ఆంక్షలు విధించి నానా హింసకు గురిచేసింది. దాంతో కమల్ చాలావరకూ నష్టపోవాల్సొచ్చింది. ఎన్నో సమస్యలను ఎదుర్కొని చివరికి రిలీజ్ చేసి సక్సెసయ్యాడు. ఇప్పుడు రెండో పార్ట్కి కూడా అవే సమస్యలు ఎదురవుతూండటంతో ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు.
అయితే రెండో భాగంలో ఎలాంటి సమస్యాత్మక విషయాలు ఉండవని చెబుతోంది హీరోయిన్ పూజాకుమార్. పూజా కుమార్ మాట్లాడుతూ... తొలిభాగంలో ఎలాంటి అవాంఛనీయ సన్నివేశాలు లేవు. కొన్నివర్గాల వల్ల సమస్యాత్మకంగా మారింది. 'విశ్వరూపం-2'కు అలాంటి పరిస్థితి ఎదురవదని నమ్ముతున్నా. మనం స్వతంత్ర దేశంలో జీవిస్తున్నాం. మంచి అభిప్రాయాలను చెప్పే హక్కు మనకుంటుంది. అదే హక్కుతోనే కమల్ 'విశ్వరూపం' తెరకెక్కించారు. ఒకవేళ అసత్యమో, తప్పుడు అభిప్రాయాన్నో తెరకెక్కిస్తే దాన్ని తొలగించేందుకు సెన్సార్ బోర్డు ఉంది. ఇక్కడ చాలామంది సెన్సార్ అంగీకారం పొందాక కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆవేదన కలిగిస్తోంది. ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారనే విషయం అర్థమవుతోంది. రెండోభాగం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది.
విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.