Just In
- 28 min ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 45 min ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 1 hr ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
- 2 hrs ago
డైరెక్టర్ తేజ ఫోన్ చేసి అలా అనడంతో ఏడ్చేశా.. అసలు విషయం చెప్పిన షకీలా
Don't Miss!
- News
ఏపీ పంచాయతీ ఏకగ్రీవాలపై ఫోకస్, అక్రమంగా జరిగితే అంతే, కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ
- Sports
ఏఆర్ రెహమాన్ను కలిసిన టీమిండియా క్రికెటర్! ఆహ్లదకరమైన సాయంత్రం అంటూ!
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Finance
ప్రపంచంలోనే భారత్, చైనా అదుర్స్, మన పెట్టుబడులు మాత్రం డౌన్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టీవీ నటి చిత్ర మరణంపై అనుమానాలు.. మెడ, దేహంపై గాట్లు.. సూసైడ్ కాదంటూ తండ్రి పిటిషన్
ప్రముఖ నటి, టెలివిజన్ హోస్ట్ వీజే చిత్ర అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మరణం వెనుక బలమైన కారణం ఉందనే, ఆమెది ఆత్మహత్య కాదనే వాదనను కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఈ మేరకు చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చిత్ర మరణం కేసులో దర్యాప్తు మరో మలుపు తిరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..

చెన్నైలోని నాజ్రేత్ పేట్లోని హోటల్లో
డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి చెన్నై శివారులోని నాజ్రేత్పేట్లోని ఒక హోటల్లోని బాత్రూంలో ఉరివేసుకొని మరణించిన వార్త దక్షిణాది మీడియాలో సంచలనం రేపింది. తొలుత ఆమె మరణాన్ని ఆత్మహత్యగానే భావించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు యూటర్న్ తీసుకొన్నది.

గొంతు నులిమి చంపి ఉంటారనే..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీజే చిత్ర మరణానికి ముందు ఎవరితోనో ఘర్షణ పడి ఉంటారు. వారే ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారు. ఆమె మెడ చుట్టు, బుగ్గలపై వేలిగాట్లు, అలాగే ఆమె దేహంపై గాయాలు ఉన్నాయి అనే విషయం బయటకు వచ్చింది. దీంతో ఆమె మరణానికి ముందు ఆమెపై దాడి జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతున్నది.

డిసెంబర్ 4వ తేదీ నుంచి హోటల్లోనే
గత కొద్దికాలంగా తన కుటుంబ సభ్యులు, కాబోయే భర్త హేమంత్ కుమార్తో గొడవలు అవుతుండగా.. డిసెంబర్ 4వ తేదీ నుంచి ఆమె హోటల్లో ఉంటున్నారు. ఇటీవల తన తల్లితో గొడవ పడటం, అలాగే హేమంత్ కుమార్తో అభిప్రాయ బేధాలు వచ్చాయి అన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. గొడవల కారణంగానే తిరువాన్మియూర్లోని తన తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చారని తెలిపారు.

నా కూతురి మృతిపై పలు అనుమానాలు
ఇదిలా ఉండగా, చిత్ర తండ్రి కామరాజ్ నజ్రెత్పేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కూతురు మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని చిత్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కామరాజ్ పిటిషన్ దాఖలుతో ఈ కేసు దర్యాప్తులో మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

వ్యక్తిగతంగా ఎవరిపై అనుమానాలు లేవు..
వ్యక్తిగతంగా తమకు ఎవరిపై అనుమానాలు లేవు. కానీ తన తండ్రి ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై అనేక అనుమానాలు ఉన్నాయి అని వీజే చిత్ర తండ్రి కామరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. దాంతో ఈ కేసును సూసైడ్గా కాకుండా అనుమానాస్పద మరణంగా నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు.