Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
నటుడి పరువు తీస్తున్న చిన్మయి.. నకిలీ బిరుదు బట్టబయలు!
మీటూ ఉద్యమం సంధర్భంగా రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. తాను చిన్న తనంలో ఉన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చిన్మయి ఆరోపించింది. బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో చిన్మయి చేసిన వ్యాఖ్యలు సౌత్ లో కూడా అగ్గిరాజేసాయి. చిన్మయి అంతటితో ఆగలేదు. ప్రముఖ తమిళ నటుడు రాధా రవిపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం రాధారవి, చిన్మయి మధ్య వార్ కొనసాగుతోంది. రాధారవి గురించి సంచలన విషయాలు బయటపెడుతూ అతడి పరువు తీస్తోంది.
డబ్బింగ్ సంఘం నుంచి
తనపై ఆరోపణలు చేసిన చిన్మయిపై రాధారవి ప్రతీకార చర్యలు ప్రారంభించారు. రాధారవి దక్షిణ భారత డబ్బింగ్ కళాకారుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. దీనితో చిన్మయిని డబ్బింగ్ కళాకారుల సంఘం నుంచి తొలగించారు. దీనికి రెండేళ్లుగా సభ్యత్వానికి అవసరమైన డబ్బు చెల్లించలేదనే కారణాన్ని సాకుగా చూపిస్తున్నారు. తనని డబ్బింగ్ సంఘం నుంచి తొలగించడం ఎవరివల్లా కాదని.. తనకు శాశ్వత సభ్యత్వం ఉందని చిన్మయి చెబుతోంది.
పెరుగుతున్న యుద్ధం
రాధారవి, చిన్మయి మధ్య రోజు రోజుకు యుద్ధం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. డబ్బింగ్ కళాకారుల సంఘం వివాదం ముగిసిన తరువాత చిన్మయి రాధారవి పరువుపై దెబ్బ కొడుతోంది. రాధారవికి దత్తో అనే బిరుదు ఉంది. ఈ బిరుదుని మలేషియా ప్రభుత్వం తనకు ఇచ్చిందని రాధారవి చెబుతున్నారు. కానీ చిన్మయి మాత్రం ఆ బిరుదు ఫేక్ అని అసలు నిజాన్ని బట్టబయలు చేసింది.
నకిలీ బిరుదు
రాధారవికి ఇచ్చిన బిరుదు విషయంలో అసలు నిజాలు తెలుసుకునేందుకు తాను మలేషియా అధికారులకు లేఖ రాశానని చిన్మయి చేబోతోంది. తాము ఎవరికీ అలాంటి బిరుదు ఇవ్వలేదని మలేషియా అధికారులు తేల్చి చెప్పారు. రాధారవి కేవలం పైకి ముసుగుతో కనిపిస్తున్నారని చిన్మయి ఆరోపించింది. చిన్మయి ఆరోపణలతో రాధారవి మరో మారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్లాక్ మెయిల్ చేస్తోంది
బిరుదు విషయంలో చిన్మయి చేసిన ఆరోపణలపై రాధారవి స్పందించారు. చిన్మయి వైరముత్తులాగా నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోంది. అందుకే ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెబుతోంది అని రాధారవి అన్నారు. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నిజాలు మాత్రమే బయటకు వస్తాయి. తన వద్ద ఆ బిరుదుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని రాధారవి అన్నారు.