Don't Miss!
- News కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
రజనీతో చేయాలనుకున్నా... ఆ విషయం తెలిసి నిరాశ చెందా: డైరెక్టర్ శంకర్
రజనీకాంత్ హీరోగా '2.0' లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శంకర్.... దీని తర్వాత సూపర్ స్టార్తో ఓ బయోపిక్ ప్లాన్ చేసుకున్నారట. అయితే ఈ లోపే ఆ బయోపిక్ మరొకరు మొదలు పెట్టడంతో నిరాశకు గురయ్యానని, అయితే ఈ చిత్రాన్ని ఎస్.ఏ చంద్రశేఖర్ తీస్తున్నారని తెలిసి సంతోషించానని శంకర్ తెలిపారు. చెన్నైలో సోమవారం సాయంత్రం జరిగిన 'ట్రాఫిక్ రామస్వామి' ఆడియో వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రాఫిక్ రామస్వామి ఎవరు?
తమిళనాడుకు చెందిన సామాజికవేత్త కెఆర్ రామస్వామి. రాష్ట్రంలో ట్రాఫిక్కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రామస్వామి ఎంతో కృషి చేశారు. దీంతో ఆయన్ను అందరూ ‘ట్రాఫిక్ రామస్వామి' అని పిలుస్తుంటారు.
రామస్వామి జీవితం ఆధారంగా బయోపిక్
ప్రముఖ తమిళ దర్శకుడు, హీరో విజయ్ తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్ ప్రధాన పాత్రలో ‘ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్ రూపొందుతోంది. ఈ చిత్రానికి విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం చెన్నైలో జరిగిన ఆడియో వేడుకకు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నేను తీయాలనుకున్నాను, కానీ...
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..‘ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి రామస్వామి. అప్పట్లో ఆయన చేస్తున్న పనులు చూసి ఆశ్చర్యపోయేవాడిని, పేపర్లో ఆయన గురించి చదివి మనసులోనే అభినందిచేవాడిని. ఆయన కత్తి పట్టని భారతీయుడు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో రామస్వామి బయోపిక్ తీయాలనుకున్నాను, అయితే ఈ సినిమా మరొకరు చేస్తున్నారని తెలిసి నిరాశ చెందాను. కానీ ఇందులో నటిస్తున్నది ఎస్.ఏ.చంద్రశేఖర్ అని తెలిసి సంతోషంగా ఫీలయ్యాను అని శంకర్ తెలిపారు.
చంద్రశేఖర్ చక్కగా ఒదిగిపోతారు
‘ట్రాఫిక్ రామస్వామి బయోపిక్లో ఎస్.ఏ చంద్రశేఖర్ చక్కగా ఒదిగిపోతారు. ఈ సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్' చెబుతూ శంకర్ తన ప్రసంగం ముగించారు. ఈ చిత్రంలో అంబిక, ఆర్కే సురేష్, మనోబాలా, చేతన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.