Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
షాలినీపై కస్సుమన్న అజిత్... కారణం వెల్లడించిన హీరో కో-స్టార్
కోలీవుడ్ మెగాస్టార్ అజిత్ హీరోగానే కాదు, మంచి మనసున్న మారాజుగానూ పేరుగడించాడు. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండే తల, మృదు స్వభావి అన్న విషయమూ విదితమే. ఇక భర్తగానూ మంచిమార్కులే వేయించుకున్న అజిత్, నిజానికి షాలినీపై ఓ సారి కస్సుమన్నాడట. ఆ విషయాన్ని అతని కో-స్టార్ పృధ్వీరాజ్ వెల్లడించం మరో విశేషం.
కొంతకాలం క్రితం సూర్య, అజిత్ ల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన పృధ్వీరాజ్, ఇప్పుడు పంథా మార్చుకున్నారు. ఇండస్ట్రీలో అజిత్ మాత్రమే జెంటిల్మెన్ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అతడి మంచి మనసు వివరించేందుకు ఓ సంఘటనను కూడా గుర్తుచేసున్నాడు.
లాక్ డౌన్ కు ముందు ఓ రెస్టారెంట్ కు వెళ్లగా, అక్కడ అజిత్ భార్య షాలినీ, కుమార్తెతో పాటూ కనిపించారని తెలిపిన పృథ్వి, ఎప్పుడూ ఆమెతో మాట్లాడనందున మిన్నకుండిపోయాడట. అయితే షాలినీ సైతం అతడిని చూసినప్పటికీ, పలుకరించాలా వద్దా అన్న సంశయంలో ఉండిపోయిందట. కానీ, ఆమె ఇంటికి వెళ్లి విషయాన్ని అజిత్ కు వివరించగా, షాలినీకే చివాట్లు పడ్డాయట. పృథ్వి తన కో-స్టార్ అని, స్కూల్ లోనూ తన సీనియర్ అని, కాస్త చొరవ తీసుకుని అతడిని పలుకరించాల్సింది అని అజిత్ షాలినీపై మండిపడ్డాడట.
అజిత్ మాటలకు నొచ్చుకున్నప్పటికీ, షాలినీ తాను చేసిన పొరపాటు గ్రహించి, పృథ్వి నంబర్ తీసుకుని మరీ అతడికి కాల్ చేసి క్షమాపణలు తెలిపిందట. ఈ విషయాన్ని పృథ్వీ స్వయంగా మీడియాకు వెల్లడించడం విశేషం. ఏమైనా ఈ సంఘటనతో తలా అజిత్ హుందాతనం మరో వెల్లడైంది.