Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ సరే..మరి మూడో ఈడియట్ ఏడి?
మహేష్ బాబు తాజాగా త్రీ ఇడియట్స్ చిత్రం రీమేక్ కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో అమీర్ ఖాన్ పాత్రకు మహేష్ బాబుని, తమిళంకు విజయ్ ని ఎంపిక చేసారు. అలాగే రెండు వెర్షన్ ల లోనూ హీరోయిన్ గా ఇలియానా, బొమన్ ఇరానీ చేసిన ప్రొఫెసర్ పాత్రకు గానూ సత్యరాజ్ ని ఎంపిక చేసారు. ఇక రీసెంట్ గా రెండో ఇడియట్ గా నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు జీవాని ఎంపిక చేసారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. అయితే మూడో ఈడియట్ గా ఎవరు నటిస్తారనేది మాత్రం ఇంకా తేలలేదు. తమిళ హీరో ఆర్య ఆ లిస్టు లో ఉన్నప్పటికీ అతనికి ా పాత్ర పెద్దదవుతుందంటున్నారు. ఇక మాదవన్ చేసిన పాత్రను అతన్నే అడిగినా డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చేతులెత్తేసాడు. ఫైనల్ గా సిద్దార్ధపై అందరి కన్నూ ఉంది. బావ ప్లాప్ లో మునిగి తేలుతున్న సిద్దార్ధ రెమ్యునేషన్ బాగా ఎక్కువ చెప్పటంతో నిర్మాతలు కన్ఫూజన్ లో పడ్డారుట. శంకర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా స్క్రిప్టు పనిలో మునిగి తేలుతున్నాడని తెలుస్తోంది.