Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగాస్టార్ చిరంజీవి ఎందుకు భాగ్యరాజానే కావలన్నాడు...!
ప్రముఖ తమిళ నటుడు, రచయిత, దర్శకుడు భాగ్యరాజాకు మంచి గుర్తింపు ఉంది. పంచ్ డైలాగులు రాయడంలో భాగ్య రాజా దిట్ట. ఆ విషయం చిరంజీవికి తెలుసు. అందుకే తన కొడుకు రామ్ చరణ్ నటించిన 'మగధీర" తమిళ వెర్షన్ 'మావీరన్"కు డైలాగులు రాసిపెట్టమని నోటెడ్ యాక్టర్, డైరెక్టర్ భాగ్యరాజాని చిరంజీవి కోరాడట.
తమిళంలో చిరు తనయుడు మొదటగా పరిచయం అవుతోన్న సినిమా కాబట్టి తమిళ ఆడియన్స్ కు చేరువుగా భాగ్యరాజా డైలాగులు సమకూర్చగలడని చిరంజీవి భాగ్యరాజాని ఎన్నుకోవడం జరిగింది. సాధారణంగా డబ్బింగ్ సినిమాలంటే ఆల్రెడి ఉపయోగించిన డైలాగ్స్ తో ఎటువంటి మార్పులేకుంటే ఆడియెన్స్ అర్థం కాదనే దృక్ఫతంతో ఫ్రెష్ గా డైలాగు రాయించటానికే భాగ్యరాజ్ సహాయం కోరినట్టు సమాచారం.
మామూలుగా భాగ్యరాజా డబ్బింగ్ సినిమాలకు డైలాగులు రాయడు. కానీ చిరంజీవి హెల్ప్ చేయమని కోరడంతో, ఈ చిత్రానికి మాటలు రాయడానికి భాగ్యరాజా సమ్మతించాడట. ఇటీవలే 'మావీరన్" ఆడియో విడుదలైంది. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.