Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
తమిళ నటుడి భార్య ఆత్మహత్య.. ఇంట్లోనే భర్త, అనుమానాస్పదంగా!
వర్తమాన నటుడు సిద్ధార్థ్ గోపినాథ్ సతీమణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సిద్ధార్థ్ తమిళ చిత్రాల్లో ఇప్పుడిపుడే అవకాశాలు అందుకుం రాణిస్తున్నాడు. గత రాత్రే అతడి ఇంట్లో ఈవిషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానకర పరిస్థితుల్లో మరణించిన అతడి సతీమణిని స్మృజ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు.
భార్య భర్తలిద్దరూ
నిన్న సాయంత్రం భార్య భర్తలు ఇద్దరూ బయటకు వెళ్లి వచ్చారు. ఆ తరువాతే ఇంట్లో గొడవ ప్రారంభమైనట్లు ఇరుగు పొరుగువారు చెబుతున్నారు వ్యక్తిగత విషయాలకు సంబంధించి వీరి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.
పడక గదిలోనే
తన భార్యతో గొడవ జరగడంతో సిద్దార్థ్ ఇంటి హల్ లో పడుకున్నాడట. స్మృజ మాత్రం పడక గదిలోనే పడుకుంది. కానీ ఉదయం డోర్ కొట్టిన స్పందన లేకపోవడంతో డోర్ బద్దలు కొట్టి చూస్తే..స్మృజ సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించింది.
ఇంట్లోనే
భర్త ఇంట్లో ఉండగానే స్మృజ మరణించడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు కుటుంబ సభ్యులు, మిత్రులని విచరిస్తున్నారు. స్మృజ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి? వీరి వివాహానికి సంబందించిన వివరాలని పోలీసులు తెలుసుకుంటున్నారు.
మలుపు చిత్రంలో
సిద్దార్థ్ గోపినాథ్ 2015 లో యాగవరయినుమ్ నా కాక్క అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో హీరో. మలుపు పేరుతో తెలుగులో ఈ చిత్రం విడుదలైంది.