Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కమల్కు జోడీ గా పవన్ అత్త
ఇందులోభాగంగా.. నదియా, సిమ్రాన్ పేర్లను పరిశీలిస్తున్నారట. సిమ్రాన్ గతంలో కమల్హాసన్తో 'పమ్మల్కే సంబంధం', 'పంచతంత్రం' చిత్రాల్లో నటించింది. నదియా మాత్రం ఇంతవరకు కలిసి పనిచేయలేదు. హీరోయిన్గా ఆమె ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనూ కమల్తో నటించే అవకాశాన్ని తిరస్కరించారామె. కమల్ సినిమా అంటేనే లిప్లాక్ తప్పనిసరి కావటంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'దిష్యం' రీమేక్లో కమల్కు జంటగా ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే నదియా నే అడిగే అవకాస మున్నట్లు చెప్తున్నారు. నదియా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో చేసింది. ఆ చిత్రంలో పవన్ అత్తగా మరిపించింది.
ఓ మంచి పాత్ర ఉందంటే నటులు దాన్ని చేసి మెప్పించాలని తాపత్రయపడుతూంటారు. తాజాగా విక్రమ్,కమల్ హాసన్ విక్రమ్ ఓ పాత్ర కోసం పోటీ పడ్డారు. అయితే అది కమల్ నే వరించిందని కోలీవుడ్ సమాచారం. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, సీనియర నటి మీనా ప్రధాన పాత్రధారులుగా ఇటీవల విడుదలైన 'ద్రిష్యుం' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. అందులో మోహన్ లాల్ పాత్ర కోసం ఈ నటులిద్దరూ పోటీ పడ్డారు.
ప్రేమ, యాక్షన్ సన్నివేశాలకు తావులేని ఈ చిత్రంలో మోహన్లాల్ ఇద్దరు పిల్లలకు అమాయక తండ్రిగా కనిపించి మెప్పించారు. ఈ పాత్రలో నటించేందుకు తమిళం నుంచి కమల్హాసన్, చియాన్ విక్రమ్ ఆసక్తి కనబర్చారని తెలిసింది. దర్శకుడు జీతుజోసఫ్ మాత్రం కమల్నే ఎంపిక చేసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. తమిళంలోనూ ఆయనే తెరకెక్కించనున్నారని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం.
ఇక రీమేక్ సినిమాలను ఎన్నింటినో చేసి రీమేక్ ల ద్వారా హిట్ లు సాధించిన మన తెలుగు హీరో వెంకటేష్ మరో సారి ఈ రీమేక్ సినిమా ని ఎంచుకున్నారు. "దృశ్యం'' సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా పునర్ నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైడ్ యాంగిల్ ఈ మూడు సంస్థలు సినిమాను తెలుగులో సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు.