Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రజనీ సింగపూర్ నుండి రాగానే అడ్రస్ మారుతోంది..!?
సింగపూర్లో విశ్రాంతి తీసుకుంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం చెన్నై నగర శివారులో కొత్త ఇల్లు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అనారోగ్యం కారణంగా సింగపూర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందిన రజనీ ప్రస్తుతం అక్కడే ఓ ఇంటిని అద్దెకుతీసుకుని విశ్రాంతి పొందుతున్నారు. మరో రెండు నెలల్లో ఆయన చెన్నై వచ్చే అవకాశముంది. ఆయనిక్కడికి చేరుకున్నప్పటికీ నెల రోజుల పాటు కాలుష్యరహిత ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో కేలంబాక్కంలో కొత్త ఇంటిని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం రజనీ ఉంటున్న ఇల్లు చెన్నై పోయెస్ గార్డెన్ లో ఉంది. అక్కడ ట్రాఫిక్ సమస్య, వాహనాల రణగొణ ధ్వనులు, వాతావరణ కాలుష్యం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని నగర శివారు ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకే రజనీ మొగ్గుచూపుతున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆయన సతీమణి లతా రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో హఠాత్తుగా దర్శనమిచ్చారు. ఆమెను గుర్తించిన కస్టమ్స్ అధికారులు, ప్రయాణికులు రజనీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజనీ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో చెన్నై చేరుకుంటారని చెప్పారు. సో రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు. రజనీకాంత్ తదుపరిచిత్రం రానా ఈ సంవత్సరం చివరన మొదలౌతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.