twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ప్లేస్ ను భర్తీ చేయనున్నగజినీ సూర్య...

    By Sindhu
    |

    'త్రీ ఇడియట్స్" రీమేక్ నుంచి మహేష్ తప్పుకోవడంతో ఇక ఈ చిత్రంలో లీడ్ రోల్ ఎవరు పోషిస్తారనే విషయంపై చాలా చర్చ జరుగుతోంది. అయితే ఇన్నాళ్లూ తెలుగు వెర్షన్ లో కేవలం మహేష్ ఒక్కడినే తెలుగువాడిని పెట్టి మిగతా బ్యాచ్ అంతా తమిళోళ్లనే తీసుకోవాలని అనుకున్న డైరెక్టర్ శంకర్ ఇక ఆ పాత్రని కూడా తమిళ హీరోతోనే చేయించాలని అనుకుంటున్నాడట. తమిళంలో ఈ చిత్రం చేయడానికి మొదట అంగీకరించినా తర్వాత కొన్ని కారణాల వల్ల విజయ్ తప్పుకోవడంతో, తెలుగు, తమిళ వెర్షన్ కి సరిపడే ఇమేజ్ ఉన్న నటుడితో ఈ చిత్రాన్ని చేయాలని శంకర్ భావిస్తున్నట్టు భోగట్టా. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య అయితే ఈ పాత్రకి బాగుంటాడనేది శంకర్ ఆలోచనట.

    అజిత్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ సూర్యకి ఎక్కువ అవకావముందని అంటున్నారు. డైరెక్టర్ ఇమేజ్ కి వేల్యూ ఇచ్చి సినిమాలు చేసే సూర్య సాక్షాత్తూ శంకర్ అడిగితే కాదనడని నిర్మాతలు నమ్ముతున్నారు. సూర్యతో చేయడం వల్ల ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రెండుసార్లు విడివిడిగా షూటింగ్ చేయాల్సిన అవసరం ఉండదని, సూర్యకి తెలుగునాట ఉన్న మార్కెట్ కి తోడు శంకర్ బ్రాండ్ నేమ్ ఎలాగో ఉంది కాబట్టి త్రీ ఇడియట్స్ రీమేక్ అలా లాగించేయాలని ఆలోచిస్తున్నారు. అయితే మహేష్ ఈ చిత్రంలోంచి తప్పుకోవడానికి కారణం శంకర్ చూపించిన అరవ అభిమానమేనని అంటున్నారు. తెలుగువాళ్లు కూడా అతడిని తమవాడిగా భావిస్తున్నారు కానీ శంకర్ కి మాత్రం అరవ అభిమానం నరనరాన నాటుకుపోయింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X