Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ ప్లేస్ ను భర్తీ చేయనున్నగజినీ సూర్య...
'త్రీ ఇడియట్స్" రీమేక్ నుంచి మహేష్ తప్పుకోవడంతో ఇక ఈ చిత్రంలో లీడ్ రోల్ ఎవరు పోషిస్తారనే విషయంపై చాలా చర్చ జరుగుతోంది. అయితే ఇన్నాళ్లూ తెలుగు వెర్షన్ లో కేవలం మహేష్ ఒక్కడినే తెలుగువాడిని పెట్టి మిగతా బ్యాచ్ అంతా తమిళోళ్లనే తీసుకోవాలని అనుకున్న డైరెక్టర్ శంకర్ ఇక ఆ పాత్రని కూడా తమిళ హీరోతోనే చేయించాలని అనుకుంటున్నాడట. తమిళంలో ఈ చిత్రం చేయడానికి మొదట అంగీకరించినా తర్వాత కొన్ని కారణాల వల్ల విజయ్ తప్పుకోవడంతో, తెలుగు, తమిళ వెర్షన్ కి సరిపడే ఇమేజ్ ఉన్న నటుడితో ఈ చిత్రాన్ని చేయాలని శంకర్ భావిస్తున్నట్టు భోగట్టా. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య అయితే ఈ పాత్రకి బాగుంటాడనేది శంకర్ ఆలోచనట.
అజిత్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ సూర్యకి ఎక్కువ అవకావముందని అంటున్నారు. డైరెక్టర్ ఇమేజ్ కి వేల్యూ ఇచ్చి సినిమాలు చేసే సూర్య సాక్షాత్తూ శంకర్ అడిగితే కాదనడని నిర్మాతలు నమ్ముతున్నారు. సూర్యతో చేయడం వల్ల ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రెండుసార్లు విడివిడిగా షూటింగ్ చేయాల్సిన అవసరం ఉండదని, సూర్యకి తెలుగునాట ఉన్న మార్కెట్ కి తోడు శంకర్ బ్రాండ్ నేమ్ ఎలాగో ఉంది కాబట్టి త్రీ ఇడియట్స్ రీమేక్ అలా లాగించేయాలని ఆలోచిస్తున్నారు. అయితే మహేష్ ఈ చిత్రంలోంచి తప్పుకోవడానికి కారణం శంకర్ చూపించిన అరవ అభిమానమేనని అంటున్నారు. తెలుగువాళ్లు కూడా అతడిని తమవాడిగా భావిస్తున్నారు కానీ శంకర్ కి మాత్రం అరవ అభిమానం నరనరాన నాటుకుపోయింది.