Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విడాకులపై స్పందించిన రజనీకాంత్ కూతురు!
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం చెన్నైకి చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్తో ఆరేళ్ల క్రితం ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సౌందర్య కాపురం గురించి ఓ షాకింగ్ న్యూస్ రెండు మూడు రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు జాతీయ మీడియాలో సైతం వార్తలొచ్చాయి.
ఈ వార్తలపై సౌందర్య స్పందించారు. భర్త నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సౌందర్య స్పష్టం చేసారు. జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ.... విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్న మాట వాస్తవమే అన్నారు.
ప్రస్తుతం విడాకుల ప్రక్రియ జరుగుతోందని, ఇకపై తన కొడుకే తనకు సర్వస్వమని అశ్విన్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన విషయమని, ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని, అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.
విడాకుల కారణంపై
అయితే విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటనే దానిపై స్పందించడానికి ఆమె నిరాకరించారు. ప్రస్తుతం సౌందర్య తన సినిమా రంగంలోనే తన కెరీర్ ఎంచుకుంది. త్వరలో తన తండ్రి జీవితంపై సినిమా తీయబోతోంది.
|
కొడుకే సర్వస్వం
విడాకుల వార్త మీడియాలో హల్ చల్ అయిన కొన్ని గంటల్లోనే సౌందర్య ఓ ట్వీట్ చేసారు. ఇకపై తన జీవిత సర్వస్వం తన కొడుకు వేద్ కృష్ణ అంటూ ఆ ట్వీట్ ఉద్దేశ్యం
|
వీళ్లే నా బలం
ఈ రోజు సౌందర్య 31వ జన్మదినం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన సినిమా టీం గురించి ఓ ట్వీట్ చేసారు. వీళ్లు మా అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇదే నా టీం... వీళ్లే నా బలం అంటూ సౌందర్య ట్వీట్ చేసారు.
ఐశ్వర్య, సౌందర్య కలిసి
రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు కలిసి తన తండ్రి జీవితాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు.
భర్త ప్రస్తుతం అమెరికాలో
అశ్విన్ ఇపుడు యూఎస్ఏ లో ఉన్నారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు టాక్. ఆయన తిరిగి రాగానే ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు పొందుతారని తెలుస్తోంది. సౌందర్య పెళ్లి జరిగిన ఆరేళ్లలోనే పెటాకులు కావడం రజనీ అభిమానులను బాధిస్తోంది.