Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'ఎటో వెళ్లిపోయింది మనసు' ఆడియో విడుదల తేదీ ఖరారు
చెన్నై: నాని, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. సి.కల్యాణ్ నిర్మాత. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే నెల 2న పాటల్ని విడుదల చేస్తారు. యాక్షన్, అడ్వంచరస్ మూవీస్ తీసే దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రేమకథను తెరకెక్కిస్తే... అది ఎలా ఉంటుంటో 'ఏ మాయ చేశావె' రుజువు చేసింది. ఆ సినిమాతో తెలుగునాట ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఏర్పడ్డారు. 'ఏ మాయ చేశావె' ఇచ్చిన స్ఫూర్తితో గౌతమ్ మీనన్ మరో ప్రేమకథను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే పేరుతో ఆ సినిమా తెలుగులో విడుదల కానుంది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం. అంటే... ఈ సినిమా ద్వారా సమంత బాలీవుడ్కి పరిచయం కానున్నారన్నమాట. ఈ ప్రేమ కథకు ఇళయరాజా సంగీతాన్ని అందించడం మరో విశేషం. ఈ సినిమాతో సమంత, గౌతమ్ మీనన్లు మరోసారి యువతను 'మాయ'లో పడేయడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఆ కుర్రాడి మనసు దారి తప్పి ఎటో వెళ్లిపోయింది. ఒంటరైన ఆ కుర్రాడు తన తోడు కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో ఎదురుపడిన ఓ యువతిని... నా మనసు జాడ నీకైనా తెలుసా? నీ వైపే వచ్చినట్లుంది అంటూ ఆరా తీశాడు. మరి ఆ చిన్నదాని సమాధానమేమిటో తెరపైనే చూడాలంటున్నారు . నిర్మాత మాట్లాడుతూ ''మూడు దశల్లో తారసపడ్డ ఓ యువ జంట కథ ఇది. వారి మధ్య ప్రేమ అనేది ఏ క్షణంలో పుట్టిందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకొనేలా సాగుతుంది. ఇళయరాజా బాణీలు చిత్రానికి బలాన్నిస్తాయి''అన్నారు.