Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రజనీకాంత్ కూతురు ఎమోషనల్ పోస్ట్: సరిగ్గా 8 ఏళ్ల క్రితం..
రజనీకాంత్ కూతురు సౌందర్య తన తండ్రి గురించి సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయింది. కొచ్చాడయాన్ సినిమా షూటింగ్ సమయంలో రజనీ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి అప్పట్లో కాస్త ఆందోళనకరంగా ఉండటంతో అభిమానులు సైతం కంగారు పడ్డారు.
అయితే సింగపూర్లో చికిత్స అనంతరం రజనీకాంత్ పూర్తి ఆరోగ్యంతో ఇండియా తిరిగి వచ్చారు. కోట్లాది మంది అభిమానులు ఆయన బావుండాలని చేసిన ప్రార్థలు ఫలించాయి. రజనీ చెన్నైలో అడుగు పెట్టిన తర్వాత ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు.
మానాన్న నిజంగా దేవుడి బిడ్డ
8 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని రజనీకాంత్ కూతురు సౌందర్య గుర్తు చేసుకున్నారు. ఈ రోజు(జులై 13) మాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సింగపూర్లో అప్పకు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత సరిగా ఇదే రోజు చెన్నై వచ్చాను. నువ్వు నిజంగానే దేవుడి బిడ్డవు నాన్న. నాన్న కోసం ఎంతో మంది ప్రార్థనలు చేశారు. మా కుటుంబం కోసం, నాన్న కోసం ఇంకా ప్రార్థనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారందరికీ థాంక్స్.... అని సౌందర్య తెలిపారు.
చికిత్స అనంతరం మరింత ఉత్సాహంగా
సింగపూర్లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రజనీకాంత్... వరుస సినిమాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతున్నారు. చికిత్స తర్వాత ఆయన ‘కబాలి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు కాలా, పేట లాంటి హిట్ చిత్రాలు చేశారు. 2.0 లాంటి భారీ బడ్జెట్ మూవీలో నటించారు.
రజనీకాంత్ ఈ వయసులో కూడా
రజనీకాంత్
వయసు
ప్రస్తుతం
68
సంవత్సరాలు.
ఇప్పటికీ
ఆయన
ఎలాంటి
అలుపు
లేకుండా
ప్రేక్షకులను
అలరిస్తున్నారు.
యువ
హీరోలతో
పోటీ
పడుతూ
డాన్సులు,
ఫైట్లు
చేస్తూ
వరుస
విజయాలు
నమోదు
చేస్తున్నారు.
దర్బార్
ప్రస్తుతం రజనకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాలా ఏళ్ల తర్వాత రజనీ మళ్లీ పోలీసుగా కనిపించబోతున్నారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా... సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, నివేతా థామస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.