Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
యువన్ శంకర్రాజా... ముస్లింగా ఎందుకు మారారంటే
చెన్నై : 'ఇసైజ్ఞాని' ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్రాజా దాదాపు వందలకు సంగీతం సమకూర్చి పేరొందారు. ఇటీవల ఆయన ముస్లింగా మారారు. రంజాన్ సందర్భంగా మసీదుకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి.
దీనిపై యువన్ వివరణ ఇస్తూ.. ''మత మార్పునకు కారణం అమ్మే. ఆమె అనారోగ్యం పాలైనప్పుడు ముంబయిలో ఉన్నా. వెంటనే చెన్నైకి వచ్చా. సోదరితో కలిసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లా. ఆమె నా చెయ్యి పట్టుకుని ఆవేదన చెందారు. తరువాత దూరమయ్యారు. అమ్మ ఏమైపోయిందోనని ఆలోచించా. ఆమె ఆత్మ ఎలా రూపాంతరం చెందిందోనని వెతకడం ప్రారంభించా.
నా ముస్లిం స్నేహితుడొకరు.. మక్కాలో తాను ప్రార్థన చేసిన చాపను నాకు ఇచ్చారు. గుండె భారంగా ఉన్నప్పుడు దీనిపై కూర్చోమని చెప్పారు. దాన్ని నా గదిలో పెట్టేశాను. ఓ సారి మరో మిత్రుడితో అమ్మ గురించి మాట్లాడుతుండగా ఆ చాపపై కూర్చున్నా. ఖురాన్ పఠించడం ప్రారంభించా. జనవరిలో మతం మారాలని నాన్నతో చెప్పా. అడ్డుకోలేదు. ఆ తరుణంలోనే అమ్మ నా చేయి పట్టుకుని 'నువ్వు ఒంటరిగా ఉన్నావు. ముస్లిం అనే మహావృక్షం కింద కూర్చోమ'ని సలహా ఇచ్చినట్లు అనిపించింది. అలా మతం మారాను'' అని పేర్కొన్నారు.