Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
తారలు మారినా, సాగుతున్న మొగలిరేకులు
మంజులానాయుడు ఈ సీరియల్కు కథ రాశారు. 860కి పైగా ఎపిసోడ్స్ ఇప్పటి వరకు ప్రసారమయ్యాయి. ముళ్లు, పాముల మధ్య వికసించే పూల గురించి ఈ సీరియల్ మాట్లాడుతుందని భాష్యం చెబుతారు. అయోమయం, గందరగోళం బతుకులు బతికే వ్యక్తుల మధ్య ప్రేమ వికసించే తీరును ఈ సీరియల్ చిత్రీకరించింది. తమ తమ జీవితాల్లో వేర్వేరు సందర్భాల్లో దెబ్బలు తిన్న ఐదుగురు అనాథల కథ ఇది.
వారి జీవితాల్లో నుదుటి రాత అనేక మలుపులకు కారణమవుతుంది. తమ తమ అనుభవాలను వారు పంచుకుంటుంటారు. ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ఈ సీరియల్ సాగుతోంది. ఈ రోజు సీరియల్ ముగిసే సరికి రేపు ఏమవుతుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తూ నెలల తరబడి ఈ సీరియల్ అవిచ్ఛిన్నంగా సాగుతోంది.
ఆర్కె నాయుడు పాత్ర ఈ సినిమాలో హైలెట్గా నిలుస్తుంది. చిన్నతంలో తప్పిపోయిన అతని కుమారుడి పాత్రను కూడా ఒకే నటుడు పోషించాడు. అలాగే సెల్వమణి పాత్ర, సెల్వమణి తల్లి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చెడ్డవాళ్లు మంచివాళ్లుగా మారుతున్న దశకు ప్రస్తుతం ఈ సీరియల్ చేరుకుంది. వివిధ పరిస్థితుల వల్ల, కారణాల వల్ల తప్పుడు పనులు చేసేవారిని ప్రేమ మంచి మనుషులుగా మార్చేస్తుంటుంది. ఆరె నాయుడు పాత్ర ఆ మార్పునకు కేంద్ర బిందువుగా పనిచేస్తూ ఉంటుంది.