Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
తారలు మారినా, సాగుతున్న మొగలిరేకులు
మంజులానాయుడు ఈ సీరియల్కు కథ రాశారు. 860కి పైగా ఎపిసోడ్స్ ఇప్పటి వరకు ప్రసారమయ్యాయి. ముళ్లు, పాముల మధ్య వికసించే పూల గురించి ఈ సీరియల్ మాట్లాడుతుందని భాష్యం చెబుతారు. అయోమయం, గందరగోళం బతుకులు బతికే వ్యక్తుల మధ్య ప్రేమ వికసించే తీరును ఈ సీరియల్ చిత్రీకరించింది. తమ తమ జీవితాల్లో వేర్వేరు సందర్భాల్లో దెబ్బలు తిన్న ఐదుగురు అనాథల కథ ఇది.
వారి జీవితాల్లో నుదుటి రాత అనేక మలుపులకు కారణమవుతుంది. తమ తమ అనుభవాలను వారు పంచుకుంటుంటారు. ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ఈ సీరియల్ సాగుతోంది. ఈ రోజు సీరియల్ ముగిసే సరికి రేపు ఏమవుతుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తూ నెలల తరబడి ఈ సీరియల్ అవిచ్ఛిన్నంగా సాగుతోంది.
ఆర్కె నాయుడు పాత్ర ఈ సినిమాలో హైలెట్గా నిలుస్తుంది. చిన్నతంలో తప్పిపోయిన అతని కుమారుడి పాత్రను కూడా ఒకే నటుడు పోషించాడు. అలాగే సెల్వమణి పాత్ర, సెల్వమణి తల్లి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చెడ్డవాళ్లు మంచివాళ్లుగా మారుతున్న దశకు ప్రస్తుతం ఈ సీరియల్ చేరుకుంది. వివిధ పరిస్థితుల వల్ల, కారణాల వల్ల తప్పుడు పనులు చేసేవారిని ప్రేమ మంచి మనుషులుగా మార్చేస్తుంటుంది. ఆరె నాయుడు పాత్ర ఆ మార్పునకు కేంద్ర బిందువుగా పనిచేస్తూ ఉంటుంది.