అటు ‘పడమటి గాలి’ సీరియల్ లో ఇటు శివాజి సినిమాలో

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...'సినిమా నుంచి సీరియల్ వైపు రావడం యాదృచ్ఛికం. అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అందుకే వాటిలో నటిస్తున్నా. సినిమాలు సినిమాలే. సీరియళ్లు సీరియళ్లే' అంది అదితి అగర్వాల్. 'వైష్ణవి'గా ఈ సీరియల్లో ప్రధాన భూమికను పోషించిన అదితి. త్వరలోనే శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో 40 రోజుల చిత్రీకరణకు గాను ఈయూనిట్ వెళ్లబోతోంది.
ఇండియా నుంచి అమెరికా వెళ్లే ప్రతి అమ్మాయి సమస్యను ఆవిష్కరిస్తుందీ సీరియల్. తెలుగు లోగిళ్ల నుంచి అమెరికా వెళ్లే ఏ అమ్మాయి అయినా సమస్యలను ఎదిరించి పోరాడాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే నంటోంది. షీర్ మీడియా ప్రై.లిమిటెడ్ బ్యానర్పై ఎన్.జె.హెన్రీ ఈ సీరియల్ని నిర్మిస్తున్నారు. 'శుభలేఖ' సుధాకర్, 'మయూరి' సుధాచంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్లో మలయాళ హీరో ప్రజిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సీరియల్ని ఎక్కువ శాతం విదేశీ లొకేషన్స్లో చిత్రీకరించారు.
ప్రస్తుతం అదితి అగర్వాల్ ..శివాజి సరసన నటించింది. గాంధీ మనోహర్ డైరక్ట్ చేసిన ఆ చిత్రం టైటిల్ ఏం బాబూ లడ్డూ కావాలా. షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆడియో లాంచింగ్ కి ముస్తాబు అవుతోంది. వచ్చే నెలలో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం క్లిక్ అయితే ఈ సీరియల్ కి కూడా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.
టెలీకాస్ట్ సమయం: జెమినీ టీవిలో 'పడమటి గాలి' సీరియల్ రాత్రి ఎనిమిది గంటలుకు ప్రసారం అవుతోంది.


Click it and Unblock the Notifications











