Don't Miss!
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఓ వైపు నవ్వించారు.. మరో వైపు ఏడిపించేశారు.. ఆ కమెడియన్లకు నివాళి
ప్రతీ పండుగలకు ఈటీవీలో మల్లెమాల వారు, జబర్దస్త్ ఆర్టిస్ట్లందిరూ కలిసి ఓ స్పెషల్ ఈవెంట్లు చేస్తుంటారు. ప్రతీ పండుగకు కొత్త కొత్త కాన్సెప్ట్లను తీసుకొస్తారు. అందరిక కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇంత వరకు తెర మీదకు రాని వారిని తీసుకొచ్చి ఎమోషనల్ అయ్యేలా చేస్తారు. ఓ జబర్దస్త్ ఫ్యామిలీ, వాళ్ల బ్యాక్ గ్రౌండ్తో ఈవెంట్ చేశారు. మరోసారి కష్టపడి ఎదిగిన వారిని ఇలాంటి ఈవెంట్ల ద్వారా అందరికీ మరోసారి పరిచయం చేస్తుంటారు. మ్యాజిక్ విన్యాసాలు, మ్యూజిక్ బ్యాండ్లు ఇలా అందర్నీ తీసుకొస్తుంటారు.
ఈ సారి కూడా..
దసరాకు జబర్దస్త్ ఆర్టిస్ట్లందరూ కలిసి అక్కా ఎవరే అతగాడు అనే ఈవెంట్ను ప్లాన్ చేశారు. ప్రతీ సారి రోజా స్పెషల్ అట్రాక్షన్గా ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆమె స్థానంలో సంగీతను తీసుకొచ్చారు. నవదీప్, శేఖర్ మాస్టర్, రష్మీ, వర్షిణి ఇలా అందరూ స్పెషల్ ఎంట్రీలు ఇచ్చారు.
డిఫరెంట్ కాన్సెప్ట్..
అయితే ఈ ఈవెంట్లో కేవలం ఫన్ మాత్రమే కాదు ఓ మెసెజ్ కూడా ఇవ్వబోతోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్లో మనం చాలా మంది కమెడియన్లు కోల్పోయాం. ఈ మధ్య కాలంలోనే జయప్రకాష్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ తరపు కమెడియన్లను గుర్తుకు తెచ్చే విధంగా ఓ స్కిట్ చేశారు.
వారి ఫ్యామిలీలు కూడా..
ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం ఎస్ నారాయణ, ఏవీఎస్, వేణు మాధవ్, జయప్రకాష్ రెడ్డి, కొండవలస ఇలా కమెడియన్లకు డూప్లు గెటప్లు వేసుకొచ్చి వారి మనోభావాలను తెలిపాడు. ఈ దివంగత కమెడియన్ల అంతరంగాలను, సదరు కమెడియన్ల కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూపించాడు.
కన్నీరు పెట్టేశారు..
మామూలుగా కమెడియన్లను ఎవ్వరూ పట్టించుకోరని, వారు చనిపోయినా, వారి ఫ్యామిలీల గురించి ఎవ్వరూ పట్టించుకోరని, ఇలా మమ్మల్ని గుర్తు పెట్టుకుని పిలిచినందుకు థ్యాంక్స్ అని కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషనల్ అయ్యారు. జయప్రకాష్ రెడ్డి, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గెటప్ వేసుకున్న ఆర్టిస్ట్లు నిజంగానే ఏడిపించేశారు. ఇక వేణు మాధవ్ అబ్బాయి స్టేజ్ మీదనే కన్నీరు పెట్టుకున్నాడు.