Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
బిగ్ బాస్ హౌస్లోకి సీనియర్ హీరో ఎంట్రీ: కంటెస్టెంట్లతో కలిసి రచ్చ రచ్చ చేయనున్న స్పెషల్ గెస్ట్.!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్ షో. ఎప్పుడూ చూడని సరికొత్త కంటెంట్తో ప్రసారం అవుతున్నప్పటికీ... దీనికి మన ప్రేక్షకులు అనుకున్న దానికంటే ఎక్కువ మద్దతునే ఇస్తున్నారు. ఈ కారణంగానే బిగ్ బాస్ షో తెలుగులో సూపర్ సక్సెస్ అయింది. అదే సమయంలో మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగోది కూడా మొదలైంది. ఆసక్తికరంగా సాగుతోన్న ప్రస్తుత సీజన్లో ఓ స్పెషల్ గెస్ట్ రచ్చ రచ్చ చేయనున్నాడట. దీపావళి వేళ ఇది జరగనుందని టాక్. ఆ వివరాలు మీకోసం.!
మూడు సీజన్లు పూర్తి.... దేనికదే టాప్
తెలుగులో బిగ్ బాస్ షో ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయింది. అయినప్పటికీ దీనికి మొదటి నుంచీ మంచి స్పందనే వస్తోంది. అందుకే మన దగ్గర ఈ షో ఏకంగా మూడు సీజన్లను పూర్తి చేసుకోగలిగింది. ఆ సీజన్లు మొత్తానికి ముగ్గురు హోస్టులు (జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, అక్కినేని నాగార్జున) పని చేశారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
నేషనల్ రికార్డుతో నాలుగోది మొదలు
కరోనా వైరస్ ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో ఎన్నో సందేహాల నడుమ ప్రారంభం అయింది బిగ్ బాస్ ఫోర్త్ సీజన్. అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్ను అక్కినేని నాగార్జున తనదైన శైలి హోస్టింగ్తో నడిపించారు. దీంతో ఈ ఎపిసోడ్కు రికార్డు స్థాయిలో రేటింగ్ లభించింది. ఫలితంగా ఇండియాలోనే ఈ రేంజ్ రేటింగ్ సాధించిన మొదటి షోగా బిగ్ బాస్ నిలిచింది.
సర్ప్రైజ్లతో ఆకట్టుకుంటోన్న బిగ్ బాస్
నాలుగో సీజన్ ప్రారంభం నుంచే ప్రేక్షకులకు.. బిగ్ బాస్ నిర్వహకులు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నారు. షో ఆరంభంలోనే ముగ్గురు సెలెబ్రిటీలను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపించడంతో పాటు సరికొత్త టాస్కులు, ట్విస్టులతో ఆకట్టుకుంటున్నారు. అలాగే, స్పెషల్ గెస్టుల ఎంట్రీలు, సమంతతో హోస్టింగ్ చేయించి షోను మరో లెవెల్కు తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
అందులో అంచనాలు తప్పుతున్నాయి
బిగ్ బాస్ అంటేనే ఎంతో రహస్యంగా నడిపించే రియాలిటీ షో. ఇందులో కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకు అన్నీ సీక్రెట్గా ఉంచేలా ప్లాన్ చేస్తారు నిర్వహకులు. కానీ, ప్రతీ అంశం ప్రసారానికి ముందే లీక్ అవుతూ వస్తోంది. మూడు సీజన్లలో ఇదే పరిస్థితి కనిపించింది. అయితే, ప్రస్తుత సీజన్లో మాత్రం ప్రేక్షకుల అంచనాలు తారుమారు చేస్తూ షాకింగ్ ఘటనలు జరిగాయి.
బిగ్ బాస్ హౌస్లోకి స్పెషల్ గెస్ట్ ఎంట్రీ
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీన్ని కంటిన్యూ చేసేందుకు షో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. ఇక, దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో ఓ సీనియర్ హీరో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి, చాలా సేపు సందడి చేయనున్నాడని సమాచారం.
Recommended Video
పండుగ వేళ కంటెస్టెంట్లతో కలిసి రచ్చ
రెండో సీజన్లో వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి, కంటెస్టెంట్లతో సరదాగా గడిపాడు. ఇప్పుడదే ఫాలో అవుతూ.. ప్రస్తుత హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. అంతేకాదు, కంటెస్టెంట్లు అందరితో కలిసి ఆయన రచ్చ రచ్చ చేయనున్నారని టాక్. అలాగే, పండుగను కూడా జరుపుకోనున్నారని అంటున్నారు.