Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
1.3 లక్షల మందికి భోజనం...బిగ్ బి మెచ్చుకున్నారు
బెంగళూరు : ఎవరైనా ప్రజోపకారానికి సంభందించిన మంచి పని చేసినప్పుడు వారిని అభినందించంటం మొదటి నుంచి అమితాబ్ కు అలవాటు. తాజాగా ఆకలిగొన్న వారి కడుపు నింపేందుకు ప్రారంభించిన 'ఫీడ్ యువర్ నైబర్' కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి ప్రశంశలు అందాయి. ఆయన్ను నుంచి అందుకుంటానని వూహించలేదని కార్యక్రమ రూపకర్త మహితా ఫెర్నాండెజ్ సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ ప్లస్ ఈ పోగ్రామ్ ప్రసారం అయ్యింది.
దసరా పండుగ సమయంలో బెంగళూరులో లక్ష మందికి ఆహారాన్ని అందించాలన్న సంకల్పంతో సామాజిక మాధ్యమాల సహకారంతో సమాన మనస్కులను ఒక్కచోటకు చేర్చి ఆమె భోజన సదుపాయాలను కల్పించారు. పండుగ సమయంలో వరుసగా 11 రోజుల్లో 1.3 లక్షల మందికి భోజనం అందించారు.
మొదట రెండు వేల మంది స్వయం సేవా కార్యకర్తలు ముందుకు రాగా, చివరి రోజు నాటికి అయిదు వేల మంది ఆమెకు సహకారంగా నిలిచారు. గురువారం బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓ ప్రముఖ దృశ్యమాధ్యమ సంస్థ ద్వారా తెలుసుకున్న హిందీ తెరవేల్పు అమితాబ్ స్పందించారన్నారు.
తనను ముంబయికి పిలిపించుకుని అభినందించారని తెలిపారు. ఇకపై క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని ఆమె ప్రకటించారు.