Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
1.3 లక్షల మందికి భోజనం...బిగ్ బి మెచ్చుకున్నారు
బెంగళూరు : ఎవరైనా ప్రజోపకారానికి సంభందించిన మంచి పని చేసినప్పుడు వారిని అభినందించంటం మొదటి నుంచి అమితాబ్ కు అలవాటు. తాజాగా ఆకలిగొన్న వారి కడుపు నింపేందుకు ప్రారంభించిన 'ఫీడ్ యువర్ నైబర్' కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి ప్రశంశలు అందాయి. ఆయన్ను నుంచి అందుకుంటానని వూహించలేదని కార్యక్రమ రూపకర్త మహితా ఫెర్నాండెజ్ సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ ప్లస్ ఈ పోగ్రామ్ ప్రసారం అయ్యింది.
దసరా పండుగ సమయంలో బెంగళూరులో లక్ష మందికి ఆహారాన్ని అందించాలన్న సంకల్పంతో సామాజిక మాధ్యమాల సహకారంతో సమాన మనస్కులను ఒక్కచోటకు చేర్చి ఆమె భోజన సదుపాయాలను కల్పించారు. పండుగ సమయంలో వరుసగా 11 రోజుల్లో 1.3 లక్షల మందికి భోజనం అందించారు.
మొదట రెండు వేల మంది స్వయం సేవా కార్యకర్తలు ముందుకు రాగా, చివరి రోజు నాటికి అయిదు వేల మంది ఆమెకు సహకారంగా నిలిచారు. గురువారం బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓ ప్రముఖ దృశ్యమాధ్యమ సంస్థ ద్వారా తెలుసుకున్న హిందీ తెరవేల్పు అమితాబ్ స్పందించారన్నారు.
తనను ముంబయికి పిలిపించుకుని అభినందించారని తెలిపారు. ఇకపై క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని ఆమె ప్రకటించారు.