Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంత నవ్వించాడో అంత ఏడ్పిస్తున్నాడు.. ఎమోషనల్ అయిన అనసూయ
డ్రామా జూనియర్స్ ఫేమ్ జూనియర్ బాలయ్య గోకుల్ సాయి ఆకస్మకి మరణించడాన్న విషయాన్ని అనసూయ భరద్వాజ్ ఇంకా తట్టుకోలేకపోతోంది. ఆ కార్యక్రమానికి అనసూయ, అలీ హోస్ట్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి మరణం పట్ల అనసూయ కాస్త ఎక్కువ ఎమోషనల్ అవుతోంది.
జూనియర్ బాలయ్యగా...
స్టేజ్పై నందమూరి నటసింహం బాలకృష్ణ డైలాగ్లను చెప్పడంలో గోకుల్ సాయి ఫేమస్.. బాలయ్య మ్యానరిజాన్ని అనుకరిస్తూ.. అచ్చం అలాగే చెప్పడంతో అందరీ దృష్టిని ఆకర్శించాడు. యూట్యూబ్ లాంటి వాటిలో బాలయ్య డైలాగ్లతో గోకుల్ సాయి ఫుల్ ఫేమస్ అయ్యాడు.
డెంగీతో మృతి చెందిన గోకుల్..
డెంగీ వ్యాధి సోకడంతోనే గోకుల్ సాయి మృతి చెందినట్లు తల్లిదండ్రులు ప్రకటించారు.దీంతో సెలబ్రెటీలు సైతం గోకుల్ మృతి పట్లసంతాపం తెలిపారు. ఇంకా ఎంతో నెటిజన్లు అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
స్పందించిన అనసూయ, రష్మీ..
గోకుల్ మృతిపై స్పందించిన అనసూయ.. అతన్ని మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను.. పిల్లల ఇష్టాలను ప్రోత్సహించే మీలాంటి తల్లిదండ్రులు ఎంతో మంది స్పూర్తిదాయకం అని ట్వీట్ చేసింది. అనసూయ ద్వారా నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను.. చిన్నారి గోకుల్.. డెంగీ వల్ల మరణించాడు.. ఈ వ్యాధిపై అందరూ అవగాహన పెంచుకోండి.. జాగ్రత్తగా ఉండండి.. అతని ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నానని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Recommended Video
|
తాజాగా మరో ట్వీట్ చేసిన అనసూయ..
గోకుల్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అనసూయ కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో ట్వీట్ చేస్తూ.. అతనికి నివాళిగా రూపొందించిన వీడియోను షేర్ చేసింది. ఎంతగా నవ్వించాడో.. అంత ఎక్కువగా ఏడ్పిస్తున్నాడు అంటూ పోస్ట్ చేసింది.