లైవ్లో డ్రెస్ విప్పేసిన అనసూయ.. ఫ్యామిలీ షోలో లోదుస్తులు కనిపించేలా!
అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరంలేని పేరిది. అంతలా ఈ చిన్నది సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ మధ్య కాలంలో సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోన్న ఈ స్టార్ లేడీ.. ఇప్పుడు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ షోలో అనసూయ భరద్వాజ్ బట్టలు విప్పేయడం హాట్ టాపిక్గా మారిపోయింది. అసలేం జరిగిందో మీరే చూడండి!
తెలుగులో స్టార్ యాంకర్
'జబర్ధస్త్' షోతో అనసూయ భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చి తనదైన అందం, యాంకరింగ్తో మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేసి హవాను చూపించింది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన మార్కును చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ టెలివిజన్లో పెద్దగా కనిపించడం లేదన్నది తెలిసిందే.

వరుసగా సినిమాలు చేసి
స్టార్ యాంకర్గా సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపిన అనసూయ.. ఈ మధ్య కాలంలో మాత్రం దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'మైఖేల్'తో ఆడియెన్స్ను అలరించింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1', 'ప్రేమ విమానం' వంటి మూవీలలో అదిరిపోయే పాత్రలు చేసింది.
ఆ భారీ ప్రాజెక్టుల్లో అను
గతంలో కంటే సినిమాల ద్వారానే హైలైట్ అవుతోన్న అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ సుందరాంగి 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'ఫ్లాష్బ్యాక్' సహా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇలా హై రేంజ్ మూవీలతో తన స్థాయిని పెంచుకుంటోంది.

బుల్లితెరపైకి రీఎంట్రీతో
జబర్ధస్త్ షో నుంచి తప్పుకున్న తర్వాత అనసూయ భరద్వాజ్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టింది. అందులో ఓ షో చేసిన తర్వాత మళ్లీ గ్యాప్ ఇచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రీఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనసూయ 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోతో మరోసారి బుల్లితెరపై మాయ చేయబోతుంది.
శేఖర్ మాస్టర్తో ఫైటింగ్
'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారం కాబోతున్న ఈ షోను శ్రీముఖి హోస్ట్ చేయనుంది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు రెండు టీమ్లుగా ఏర్పడి పోటీ పడబోతున్నారు. ఇందులో ఖిలాడీ గర్ల్స్ టీమ్కు అనసూయ, కిర్రాక్స్ బాయ్స్కు శేఖర్ మాస్టర్ మెంటర్లుగా ఉన్నారు.

డ్రెస్ విప్పిన అనసూయ
హై రేంజ్లో ప్రారంభం కాబోతున్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో సెలెబ్రిటీలు చాలా మంది కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా అనసూయ డ్రెస్ విప్పేసి మరీ శేఖర్ మాస్టర్తో పోటీకి దిగింది. దీంతో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ అయిపోయింది. అలాగే, ఈ ప్రోమో కూడా ఓ రేంజ్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











