Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హ్యాపీగా లేను.. నిరాశగా ఉంది.. త్వరలో వివరంగా చెబుతా.. యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ తనకు మనసుకు నచ్చినట్టు మాట్లాడంలో ఎప్పుడూ మొహమాటం పడరు. తన నచ్చింది నచ్చినట్టు.. నచ్చనిది.. నచ్చనిదిగానే చెబుతారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్గేమ్ చిత్రం సంచలన విజయం వైపు దూసుకెళ్తున్న సమయంలో ఆమె కామెంట్ చేశారు. ఈ చిత్రం విడుదలైన 46 దేశాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. ఇక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి చివరి చిత్రం కావడంతో సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. అలాంటి క్రమంలో అవెంజర్స్ సినిమాను సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా యాంకర్ అనసూయ, ప్రముఖ రచయిత శోభాడే ఈ సినిమాపై స్పందించారు. ఏమన్నారంటే..
ఆలస్యంగా చూశాను. కానీ నచ్చలేదు
అవెంజర్స్: ఎండ్గేమ్ సినిమాను చాలా ఆలస్యంగా చూశానని నాకు తెలుసు. నా పనులను పూర్తి చేసుకొని నా సమయాన్ని ఈ సినిమాను చూడటానికి వెచ్చించాల్సి వచ్చింది. అవెంజర్స్ పక్కా వీరాభిమానిగా నేను సినిమా చూస్తున్న సేపు అక్కడక్కడా కొంత మధురమైన అనుభూతిని పొందాను. అవెంజెర్స్: ఎండ్గేమ్ చూసి హ్యాపీగా ఫీలవ్వలేదు. చాలా నిరాశ చెందాను అని చెప్పింది.
నాకు ఎందుకు నచ్చలేదంటే
అవెంజర్స్: ఎండ్గేమ్ నచ్చనంత మాత్రాన నేను అవెంజర్స్కు ఫ్యాన్ కాకుండా పోను. ఒక్కసారి అవెంజర్స్ ఫ్యాన్ అయితే ఎప్పటికీ అవెంజర్స్ ఫ్యాన్నే. మళ్లీ మిగితా 21 చిత్రాలు చూస్తాను. కానీ ఈ సినిమాను మరోసారి చూడను. ఈ సినిమా ఎందుకు నచ్చలేదనే విషయాన్ని కొన్ని వారాల తర్వాత వివరంగా వెల్లడిస్తాను. ఇప్పడు ఆ సినిమా గురించి ప్రతికూలంగా మాట్లాడి ఇతరుల మూడ్ను చెడగొట్టను అని అనసూయ అన్నారు.
శోభా డే షాకింగ్ కామెంట్లు
ఇక ప్రముఖ రచయిత్రి శోభాడే కూడా అవెంజర్స్ సినిమాపై స్పందించారు. ఈ సినిమా నాకు నచ్చలేదు. 11 ఏళ్ల కాలంగా మార్వెల్ సీక్వెల్లో అతి బోరింగ్గా తీసిన మూవీ ఇదనే అభిప్రాయం కలిగింది అని శోభా డే తెలిపారు. ఈ సినిమాను చూసే ప్రేక్షకులపై మిలియన్ డాలర్ల జోక్ వేయాలని అనిపిస్తున్నది. ఇంత వరకు ఇంత చెత్తగా ఎప్పుడూ తీయలేదు అని అన్నారు.
నెటిజన్లు దుమ్ముదులిపి...
అవెంజర్స్: ఎండ్గేమ్పై శోభా డే చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. కోతికి ఏం తెలుసు అల్లం రుచి.. నీ వయసుకు ఈ సినిమా సరిపోదు. ఏదైనా సందేశం కోసం వెతికావా? నీ అభిప్రాయం మాకు అక్కర్లేదు అంటూ నెటిజన్లు శోభా డేపై విరుచుకుపడ్డారు.
400 కోట్లవైపు పరుగులు
భారత్లో అవెంజర్స్: ఎండ్గేమ్ సినిమా వసూళ్ల కుంభవృష్టిని కురిపిస్తున్నది. ఈ చిత్రం భారత్లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం సుమారు రూ.400 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.