Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అవినాష్ పరువు తీసేసిన ఆరియానా: పాపం.. పాప దెబ్బకు మొహం వాడిపోయింది!
ఆరియానా గ్లోరి.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోన్న పేరిది. యాంకర్గా కెరీర్ను ఆరంభించి సత్తా చాటిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్లో పాల్గొనడం ద్వారా మరింత పాపులర్ అయింది. హౌస్లో జబర్ధస్త్ కమెడియన్ అవినాష్తో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఆమె.. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్లో అతడి పరువు తీసేసింది. ఈ ఘటనతో జబర్ధస్త్ కమెడియన్ ముఖం వాడిపోయింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...
Recommended Video
రాంగోపాల్ వర్మ ట్వీట్.. హాట్ టాపిక్
ఆరియానా గ్లోరీ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్గా తన కెరీర్ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసింది. అలా.. ఓ సారి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ నిర్వహిస్తుండగా.. ‘ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన అమ్మాయి నువ్వే' అంటూ ఆయన చేసిన కామెంట్తో ఆరియానా గ్లోరీ హాట్ టాపిక్ అయిపోయింది.
బిగ్ బాస్లోకి ఎంట్రీ.. బోల్డ్ బ్యూటీగా
ఆరియానా గ్లోరీ గురించి రాంగోపాల్ వర్మ ట్వీట్ కూడా చేశాడు. దీంతో ఆమె రెండు రాష్ట్రాల్లో ఊహించని విధంగా పాపులర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ బ్యూటీకి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్లో పాల్గొనే అవకాశం దక్కింది. తనదైన స్టైల్తో ఎంట్రీ ఇచ్చిన ఆరియానా.. తనను తాను బోల్డ్ బ్యూటీని అంటూ చెప్పుకుంది. అదే వ్యవహార శైలితో కనిపిస్తుంటుంది.
అవినాష్తో ట్రాకుతో మరింత హైలైట్
బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో సయ్యద్ సోహెల్ రియాన్తో కలిసి సీక్రెట్ రూమ్లోకి వెళ్లింది ఆరియానా. ఇక, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తీరుతో ఎవరూ స్నేహితులు కాలేదు. కానీ, జబర్ధస్త్ ఫేం అవినాష్ వచ్చిన తర్వాత ఆమెకు ఫ్రెండ్ అయ్యాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఎంతో క్లోజ్గా కనిపిస్తున్నారు. దీంతో వీళ్ల మధ్య ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఆమెలా మరొకరు చేయలేరు అనేలా
బిగ్ బాస్ షోలో ఆరియానా ఎంత అల్లరిగా తిరుగుతూ కనిపిస్తుందో.. టాస్కుల్లో మాత్రం అంత సీరియస్గా ఉంటుంది. టాస్క్ ఏదైనా వందకు వంద శాతం ప్రయత్నిస్తూ గెలుపొందాలని చూస్తుంది. అందుకే చాలా వాటిలో ఆమె విజయం సాధిస్తుంది. ఇలా ప్రతి దానిలో కనిపిస్తూ హైలైట్ అవుతోందామె. అందుకే పలుమార్లు నామినేషన్స్లో ఉన్నా అద్భుతమైన ఆటతో సేవ్ అవగలిగింది.
అవినాష్ పరువు తీసేసిన ఆరియానా
ఎప్పుడూ అవినాష్ను అంతెత్తుకు లేపుతూ కనిపించే ఆరియానా... తాజాగా జరిగిన ఎపిసోడ్లో మాత్రం అతడి పరువు తీసేసింది. ఆదివారం కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పెషల్ గెస్టుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన హౌస్మేట్స్ అందరినీ ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఆరియానాను అవినాష్ గురించి ఓ ప్రశ్న అడిగారు. దానికి ఊహించని సమాధానం ఇచ్చిందామె.
ఈ ఘటనతో కమెడియన్కు చుక్కలు
ఆదివారం ఎపిసోడ్లో ఆరియానా.. అవినాష్ పరువు తీసింది. ‘నువ్వు అవినాష్లా మారిపోయి.. ఆరోజు నిద్ర లేస్తే చేసే మొదటి పని ఏమిటి' అని స్పెషల్ గెస్ట్ సుదీప్.. ఆరియానాను ప్రశ్నించాడు. దానికి ఆమె ‘ఆరోజు అసలు నిద్రే లేవను. అసలు అలాంటి రోజే నాకొద్దు' అంటూ సమాధానం చెప్పింది. దీంతో నాగార్జున పగలబడి నవ్వగా, సుదీప్ సూపర్ ఆన్సర్ అంటూ కితాబిచ్చాడు.