యాంకర్ మంజూష హాట్ ఫొటో షూట్.. ఎన్టీఆర్ చెల్లిగా చేసింది ఈమేనా.. నమ్మడం కష్టమే.!
బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. వారిలో గుర్తింపు తెచ్చుకున్న వారు మాత్రం కొందరే. అలాంటి వారిలో మంజూష పేరు కూడా వినిపిస్తోంది. సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి సీనియర్ యాంకర్లు ఉన్నా.. అనసూయ, రష్మీ, విష్ణు ప్రియ, వర్షిణీ, శ్రీముఖి సత్తా చాటారు. వీరిలానే మంజూష కూడా కొంత కాలంగా తన మార్క్ చూపిస్తోంది. టీవీ షోలలో పెద్దగా కనిపించకపోయినా.. సినిమా ఫంక్షన్లు.. స్టార్స్తో ఇంటర్వ్యలతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ క్రేజీ యాంకర్.
వాస్తవానికి మోడల్గా తన కెరీర్ ఆరంభించిన మంజూష.. తెలుగు బుల్లితెరపై ఎన్నో టీవీ షోలు చేసింది. ఆ తర్వాత కొన్ని ప్రముఖ చానెళ్లలో యాంకర్గా పని చేసింది. కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ - క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన 'రాఖీ'లో అత్యంత ముఖ్యమైన చెల్లెలి పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా చూసిన వాళ్లంతా ఆమె నటనకు కన్నీరు పెట్టుకున్నారు.

ఇక, ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తాయని భావించినా.. అలా జరగలేదు. 'రాఖీ' తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ, యాంకర్గానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆమె 2500 వరకు సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు చేసింది. దీంతో ఆమెకు ఎంతో మంచి పేరు వచ్చింది. తెలుగులో ఏ సినిమా విడుదలైనా.. ఇంటర్వ్యూల కోసం అందరూ చర్చించే పేర్లలో మంజూషది ఒకటి కావడం విశేషం.
సినిమా ఫంక్షన్లు, టీవీ షోలతో బిజీగా ఉన్నప్పటికీ మంజూష సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటోంది. తన వ్యక్తిగత ఖాతాల ద్వారా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మంజూష తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఎంతో హాట్గా ఉంది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











