Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాళ్ల బండారం బయట పెట్టిన ప్రదీప్: ఆ వీడియోలో ఒకే అమ్మాయితో ఇద్దరు.. ఏకంగా ముద్దు కూడా!
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్లదే హవా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనూ నెగ్గుకొస్తూ వాళ్లకే పోటీగా నిలుస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. అద్భుతమైన టాలెంట్తో అదరగొడుతోన్న అతడు.. సమయస్ఫూర్తితో పంచులు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సౌతిండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన 'ఢీ'లో కొందరు కంటెస్టెంట్ల బండారం బయట పెట్టేశాడు. ఏకంగా వీడియోలు విడుదల చేసి మరీ రొమాన్స్ను చూపించాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!
దక్షిణాదిలోనే సక్సెస్ఫుల్ డ్యాన్స్ షో
బుల్లితెరపై వచ్చే వాటిలో డ్యాన్స్ షోలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. అందులో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతున్న 'ఢీ'. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. దీనికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాయి.
టాలీవుడ్లో ఇప్పుడు వాళ్లే పాపులర్
ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఢీ షో వల్ల ఎంతో మంది టాలెంట్ బయటకు వచ్చిందని చెప్పొచ్చు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరీ ముఖ్యంగా 'ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లుగా మారారు. వీరిలో మొదటి ముగ్గురు టాలీవుడ్లో హవాను చూపిస్తున్నారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13
ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న 'ఢీ' షో.. పదమూడో సీజన్ను కూడా ప్రారంభించింది. 'కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్కు మరింత మంది అభిమానులు వచ్చి చేరుతున్నారు.
కొత్త పిల్లను తీసుకొచ్చారు.. మొత్తంగా
'కింగ్ వర్సెస్ క్వీన్స్' సీజన్ను అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు. అబ్బాయిల టీమ్కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మెంటర్లుగా.. అమ్మాయిల జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో దీనికి జడ్జ్లుగా శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు.
ప్రదీప్దే హవా.. అదరగొట్టేస్తున్నాడుగా
'కింగ్ వర్సెస్ క్వీన్స్' అనే కాదు.. దాదాపు మూడు సీజన్లుగా ఢీ షోలో యాంకర్ ప్రదీప్ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్తో అతడు పండించే కామెడీ వేరే లెవెల్ అనే చెప్పాలి. షో మధ్యలో వాళ్లకు ఇచ్చే టాస్కుల్లో ప్రదీప్ నటన అద్భుతంగా ఉంటుంది. వీటి వల్లే కామెడీ లెవెల్ కూడా బాగా పెరిగింది. ఇది షోకు చాలా ఉపయోగపడింది.
వాళ్ల బండారం బయట పెట్టిన ప్రదీప్
13వ సీజన్లో కంటెస్టెంట్లుగా వచ్చింది అందరూ కొత్త వాళ్లే. అయినప్పటికీ వాళ్ల అద్భుతమైన డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తద్వారా మంచి గుర్తింపును కూడా అందుకుంటున్నారు. ఈ కారణంగానే షోకు కూడా ఆదరణ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు షోలోని కొందరు కంటెస్టెంట్ల బండారాన్ని వీడియోలతో సహా బయట పెట్టాడు.
Recommended Video
ఆ వీడియోలో ఒకే అమ్మాయితో ఇద్దరు
తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లను ఆడుకున్నాడు ప్రదీప్. షూటింగ్ పూర్తయిన తర్వాత వీళ్లంతా రీల్స్ చేస్తున్నారని చెప్పిన అతడు.. వాటికి మీమ్స్ను జత చేసి బిగ్ స్క్రీన్పై చూపించాడు. ముందుగా మణికంఠది.. ఆ తర్వాత ప్రసాద్ వీడియోను ప్లే చేయించాడు. ఈ రెండింటిలోనూ ఒకే అమ్మాయే ఉంది. అంతేకాదు, ఆమెతో ఇద్దరూ ముద్దులతో రొమాన్స్ కూడా చేశారు.