Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఢీ షో నాది కాదు.. ఆ విషయం నాకెలా తెలుస్తుంది.. యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్
ఒకప్పుడు ఢీ షో అంటే అందులో కేవలం డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను దాని స్వరూపమే మారుతూ వచ్చింది. ఇప్పుడు ఢీ షో అంటే జబర్దస్త్ షోలో లాంటి కుళ్లు స్కిట్లు ఉండాలి.. పిచ్చి పిచ్చి లవ్ ట్రాకులు ఉండాలి. మొత్తంగా డ్యాన్సులు తక్కువగా ఉండాలి.. జిమ్నాస్టిక్స్ వంటి సర్కస్ ఫీట్లు ఎక్కువగా ఉండాలి. ప్రస్తుతం జనాల్లో ఢీ షోపై ఉన్న అభిప్రాయం అదే. మొత్తానికి ఢీ పదమూడో సీజన్ గ్రాండ్గా లాంచ్ అయి ముందుకు దూసుకుపోతోంది.
కింగ్స్ వర్సెస్ క్వీన్..
ఢీ పదమూడో సీజన్లో కింగ్స్ వర్సెస్ క్వీన్ అంటూ కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. ఇందులో చాలా మార్పులే చేశారు. ఇంతకు ముందు హైపర్ ఆది వర్షిణి ఓ వైపు.. రష్మీ సుధీర్ మరో వైపు ఉండేవారు. మధ్య మధ్యలో వీరితో చేయించే కామెడీ స్కిట్స్ బాగానే క్లిక్ అయ్యేవి. కానీ ఈ పదమూడో సీజన్లో మాత్రం మొత్తం మార్చేశారు.
ఆమె అవుట్..
పదమూడో సీజన్లో వర్షిణినీ తీసుకోలేదు. ఆమె రాలేదో.. వీరు తీసుకోలేదో.. పక్కన పెడితే ఆమె స్థానంలో దీపిక పిల్ల వచ్చింది. కానీ ఇంత వరకు కూడా ఆమె క్లిక్ కాలేదు. కనీసం ఆమె ఉందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ గుర్తించడం లేదు. ఇలా మొత్తంగా ఆది, రష్మీ, సుధీర్ చుట్టే కామెడీ స్కిట్లు తిరుగుతున్నాయి.
వర్షిణి లేని లోటు..
అయితే ఈ పదమూడో సీజన్లో మాత్రం వర్షిణి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆది వర్షిణి, రష్మీ సుధీర్ కలిసి చేసే కామెడీని బాగానే ఇష్టపడ్డారు. కానీ ఈసారి మాత్రం రష్మీ దీపిక పిల్లి ఓ వైపు ఉన్నారు. ఆది సుధీర్ మరో వైపు ఉన్నారు. గత సీజన్లో వచ్చినంత ఫన్ ఈ సారి మాత్రం రావడం లేదు.
తాజాగా రష్మీ అలా..
తాజాగా రష్మీ తన స్నేహితురాలి కోసం బయటకు వచ్చింది. తన ఫ్రెండ్ కొత్త డిజైన్లతో కొత్త బొటిక్ను ప్రారంభించింది. ఈ క్రమంలో రష్మీ ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడింది. ఈ క్రమంలో రష్మీ కొన్ని ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు ఇచ్చింది.
వర్షిణిపై ప్రశ్నలు..
ఢీ షోలో వర్షిణి ఎందుకురావడం లేదంటూ రష్మీని ప్రశ్నించాడు. దానికి రష్మీ వెరైటీ సమాధానం ఇచ్చింది.. ఢీ షో నాది కాదు.. ఆ విషయం నాకు ఎలా తెలుస్తుంది.. మల్లెమాల వారికి ఢీ టీంకు తెలుస్తుందంటూ రష్మీ తప్పించుకుంది.