Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దాని కంటే పెద్దగా ఉంది.. జబర్దస్త్ యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన రష్మీ.. ఆపై జబర్దస్త్ వేదికపై ఓ రేంజ్లో దూసుకుపోయింది. యాంకరింగ్ గ్లామర్ను అద్దిన అతికొద్ది మంది వారిలో రష్మీ ఒకరు. తన గ్లామర్తో జబర్దస్త్ షోను లాక్కొచ్చింది. తన అందంతో బుల్లితెర ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే రష్మీ... నిత్యం ఏదో ఒక విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
నిత్యం బిజీగా..
క్షణం కాలం తీరిక లేకుండా బిజీగా ఉండే రష్మీ ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగానే వినియోగించుకుంటోంది. ఇంట్లో ఉంటూ అమ్మతో, తన పెంపుడు కుక్కతో సరదాగా గడిపేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం పలు సమస్యలపై స్పందిస్తూ తెగ బిజీగా గడుపుతోంది.
మూగ జీవాల పట్ల..
రష్మీకి మూగ జీవాల పట్ల అమితమైన ప్రేమ. వీధి కుక్కలు ఎక్కడైనా ఆహారం లేకుండా కనబడినా, వాటిని ఎవరైనా హింసించారని తెలిసినా వెంటనే స్పందిస్తుంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తుంది. తాజాగా జరిగిన కేరళ ఏనుగు ఉదంతంపైనా రష్మీ ఆవేదన చెందింది. తాజాగా రష్మీ షేర్ చేసిన వీడియో, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
లాక్డౌన్లోనూ అలా..
లాక్ డౌన్ ప్రారంభ దశలో రష్మీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ కూడా నడిచింది. అయితే రష్మీకి మాత్రం ఇలాంటి ప్రారంభోత్సవాలు బాగానే కలిసి వచ్చాయి. తాజాగా అలాగే వెళ్లిన చోట్ల మరిచిపోలేని బహుమతి లభించింది.
Recommended Video
అంత పెద్ద బహుమతి..
తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో ఓ షోరూమ్ను ప్రారంభించడానికి వెళ్లిన సమయంలో అక్కడి వారు తనకు కాజాను బహుమతిగా ఇచ్చారని తెలిపింది. అది తన మొహం కంటే పెద్దగా ఉందని, తినడానికి వారం రోజులు పడుతుందని సెటైర్స్ వేసింది. ప్రస్తుతం ఈ కాజాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతోంది.