Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్బాస్ నుంచి శ్యామల అవుట్.. రెండోసారి మధ్యలోనే ఇంటిదారి!
Recommended Video
బిగ్బాస్లో 91వ రోజు అల్లరి నరేష్, సునీల్ రాకతో అందరూ సిల్లీ ఫెలోస్గా మారారు. హోస్ట్ నాని పెద్దరాయుడిలా మారి 500 కోట్ల వివాదానికి పరిష్కారం చూపేందుకు కంకణం తొడుక్కొన్నాడు. ఆదివారం కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇంటిలోకి రెండోసారి రీ ఎంట్రి ఇచ్చిన శ్యామల బిగ్బాస్ నుంచి నిష్క్రమించింది. ఇంతకు ఏం జరిగిందంటే..
ఇంట్లోకి సిల్లీ ఫెలోస్
సిల్లీ ఫెలోస్ హీరోలు సునీల్, నరేష్ ఇంట్లోకి ప్రవేశించారు. సభ్యులందరితో పలకరింపులు మొదలుపెట్టిన తర్వాత నాని ఆధ్వర్యంలో ఓ కామెడీ స్క్రిప్టును చెప్పాడు. సిల్లీ ఫెలోస్ చిత్రం రూ.500 కోట్ల చుట్టు తిరుగుతుంది కాబట్టి.. దాని బేస్ చేసుకొని రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రచ్చబండ వద్ద పెదరాయుడిగా
రచ్చబండ కార్యక్రమంలో సునీల్ పెద్దన్నగా, నరేష్ తమ్ముడి పాత్రను పోషించారు. వీరిద్దరి నాన్న చనిపోతూ రూ.500 కోట్లు ఒకరిపేరు మీద రాస్తారు. ఆ వ్యక్తి ఎవరు అనే వివాదంపై సభ్యుల చేత అభిప్రాయాలను తీసుకొన్నారు. చివరికి సునీల్, నరేష్కు చెరో 250 కోట్లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు.
దీప్తి, కౌశల్ సేఫ్
సిల్లీఫెలోస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత నాని ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. తొలుత నామినేట్ అయిన నలుగురు సభ్యుల నుంచి దీప్తిని సేఫ్ జోన్లోకి పంపించారు. ఆ తర్వాత కౌశల్ను రెండో వ్యక్తిగా ఎలిమినేషన్ నుంచి తప్పించారు.
శ్యామల రెండోసారి అవుట్
ఇక అమిత్, శ్యామల మిగిలి ఉండటంతో ఎవరు బయటకు వెళ్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఇక ఆ ఇద్దరి వ్యక్తుల నుంచి ఒకరిని సేఫ్ జోన్లోకి పంపిస్తున్నాని చెప్పి శ్యామలను ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పడంతో అమిత్ ఊపిరి పీల్చుకొన్నారు.
రోల్ రైడాపై శ్యామల బిగ్బాంబు
ఇంటి సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన శ్యామల వేదికపై ఉన్న నాని వద్దకు చేరుకొన్నది. ఆ తర్వాత ఇంటి సభ్యులు గీతా, తనీష్తో మాట్లాడింది. ఆ తర్వాత రోల్ రైడాపై బిగ్బాంబ్ వేసింది. బిగ్బాంబ్ ప్రకారం ప్రతీ ఇంటి సభ్యుడికి సేవకుడిగా ఏ పని చెబితే అది చేయాల్సి ఉంటుంది.